News March 14, 2025
జగదేవ్పూర్: బాలిక ఆత్మహత్య

జగదేవ్పూర్ మండలం మునిగడప గ్రామంలో కడుపునొప్పి భరించలేక బాలిక ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన నర్ర బాలేశం, నాగలక్ష్మి దంపతుల కుమార్తె ప్రవళిక(13) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. రెండు రోజుల క్రితం బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లి నిన్న తిరిగొచ్చింది. కడుపునొప్పి వస్తుందని తల్లికి చెప్పి ఇంట్లోకి వెళ్లి ఉరేసుకుంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News September 17, 2025
తిరుపతి DSC అభ్యర్థులకు DEO సూచనలు

తిరుపతి జిల్లాలో DSCకి ఎంపికైన అభ్యర్థులందరికీ CMచేత అపాయింట్మెంట్ ఆర్డర్స్ మంజూరు చేస్తున్నట్లు DEO KVN కుమార్ బుధవారం తెలిపారు. DSC అభ్యర్థుల కోసం చదలవాడ రమణమ్మ ఇంజినీరింగ్ కాలేజీలో ప్రత్యేక రిజిస్ట్రేషన్ కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అభ్యర్థులు గురువారం ఉదయం 7 గంటలకు ఈ కాలేజీ వద్దకు ఫొటో, ఆధార్, కాల్ లెటర్తో హాజరు కావాలన్నారు.
News September 17, 2025
BC రిజర్వేషన్లను పెంచేందుకు చర్యలు: మంత్రివర్గ ఉపసంఘం

AP: స్థానిక సంస్థల ఎన్నికల్లోగా BC రిజర్వేషన్లను 34 శాతానికి పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రులు సవిత, కొల్లు రవీంద్ర తెలిపారు. మంత్రివర్గ ఉపసంఘం భేటీలో BC రిజర్వేషన్లపై చర్చించామన్నారు. రిజర్వేషన్లను CBN 34%కి పెంచితే, జగన్ 24%కి తగ్గించారని పేర్కొన్నారు. న్యాయపరిశీలన చేసి రిజర్వేషన్లపై పకడ్బందీ చట్టం తెస్తామన్నారు. త్వరలో BC రక్షణ చట్టానికి తుది రూపం తీసుకురానున్నట్లు చెప్పారు.
News September 17, 2025
సంగారెడ్డి: న్యాయవాదుల దీక్షను భగ్నం చేసిన పోలీసులు

న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలని కోరుతూ జిల్లా కోరుతూ ముందు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షను బుధవారం రాత్రి పోలీసులు భగ్నం చేశారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డితో పాటు న్యాయవాదులను పోలీసులు అదుపులోకి తీసుకొని పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను అరెస్టు చేయడం సరికాదని వారు తెలిపారు.