News March 14, 2025
నేటి నుంచి విశాఖలో IPL టికెట్లు

AP: విశాఖపట్నంలో ఐపీఎల్ సందడి మొదలైంది. ఈ నెల 24న ఢిల్లీ-లక్నో మధ్య జరగాల్సిన మ్యాచ్ టికెట్లు నేడు సా.4 గంటల నుంచి డిస్ట్రిక్ట్ యాప్లో విక్రయించనున్నారు. ఈ సీజన్లో విశాఖను తన సెకండ్ హోమ్ గ్రౌండ్గా ఎంచుకున్న ఢిల్లీ.. తమ తొలి మ్యాచ్ ఇక్కడే ఆడనుంది. ఈ నెల 30న ఢిల్లీ-SRH మ్యాచ్ టికెట్లు ఎప్పటి నుంచి అమ్ముతారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.
Similar News
News March 28, 2026
ఏడాది పొడవునా కాపునిచ్చే మామిడి!

సాధారణంగా మామిడి వేసవిలోనే దొరుకుతుంది. కానీ రాజస్థాన్కు చెందిన రైతు కిషన్ సుమన్ పదేళ్లు శ్రమించి ‘సదాబహార్’ అనే మామిడి రకాన్ని అభివృద్ధి చేశారు. ఇది ఏడాదికి మూడుసార్లు కాపునిస్తూ తియ్యగా, తక్కువ పీచుతో ఉంటుంది. రాష్ట్రపతి భవన్ తోటలోనూ ఇది చోటు సంపాదించుకుంది. మామిడి ప్రియులకు ఏడాది పొడవునా పండ్లను అందించే దిశగా ఇది ఒక విప్లవాత్మక మార్పు. ఈయన 7 రంగుల గులాబీ మొక్కనూ అభివృద్ధి చేశారు.
News March 28, 2026
SRHకు యంగెస్ట్ ఇండియన్ కెప్టెన్గా ఇషాన్ కిషన్!

ఇవాళ RCBతో జరిగే మ్యాచ్లో కెప్టెన్సీ చేయడం ద్వారా SRH ప్లేయర్ ఇషాన్ కిషన్ అరుదైన ఘనత సాధించనున్నారు. సన్ రైజర్స్కు నాయకత్వం వహించనున్న యంగెస్ట్(27Y 253D) ఇండియన్ కెప్టెన్గా నిలవనున్నారు. గతంలో శిఖర్ ధవన్, మనీశ్ పాండే, భువనేశ్వర్ కాస్త లేటు వయసులో సారథ్యం చేపట్టారు. ఓవరాల్గా ఈ జాబితాలో విలియమ్సన్(27Y 244D) టాప్లో ఉన్నారు. కేన్ మామ 2018లో తొలిసారి SRHను లీడ్ చేసిన విషయం తెలిసిందే.
News March 28, 2026
రోజూ పండ్లు తింటే అంతా ఆరోగ్యమే: వైద్యులు

రోజుకొక యాపిల్ తింటే ఆరోగ్యంగా ఉంటారని చెబుతుంటారు. అయితే రోజుకు 2-3 రకాల పండ్లు తినడం మన ఆరోగ్యానికి అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. ‘పండ్లలోని పీచు పదార్థం కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. పండ్లలోని సహజమైన చక్కెర.. మధుమేహం రాకుండా అడ్డుకుంటుంది. పండ్లు తినకపోతే గుండె జబ్బులు, ఇన్ఫ్లమేషన్ వంటి దీర్ఘకాలిక సమస్యలు తప్పవు. అందుకే పండ్లు తినాలి’ అని వివరించారు.


