News March 14, 2025
పల్నాడు: మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించొద్దు: ఎస్పీ

మతసామరస్యం పాటిస్తూ సంతోషకర వాతావరణంలో హోలీ పండుగ జరుపుకోవాలని ఎస్పీ కంచి శ్రీనివాసరావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. హోలీ పండుగ సందర్భంగా సాంప్రదాయ రంగులు ఉపయోగించటం ఆరోగ్యకరమని అన్నారు. ఎదుటివారి మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించవద్దని వివరించారు. ప్రధాన కుడళ్లు, కాలనీలు, రహదారులపై సీసీ కెమెరాలు ఉంచడంతో పాటు డ్రోన్లు వినియోగిస్తున్నట్లు తెలిపారు. ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News November 4, 2025
మాగాణి భూముల్లో వరికి ప్రత్యామ్నాయ పంటలు

వరి మాగాణి భూముల్లో ఆరుతడి పంటల సాగుతో అధిక లాభం పొందవచ్చని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. వరికి ప్రత్యామ్నాయంగా వేరుశనగ, ఆవాలు, నువ్వులు, శనగ, పెసలు, మినుము, జొన్న, సజ్జ, రాగులు, కొర్రలు, కూరగాయలు, పొద్దుతిరుగుడు, ఆముదం, పత్తి వంటి పంటలను ఎంపిక చేసుకోవాలని సూచిస్తున్నారు. వీటి సాగు వల్ల నేల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు రైతులకు విభిన్న పంటలతో ఆదాయం పెరుగుతుంది. వరి పంటపై ఆధారపడటం తగ్గుతుంది.
News November 4, 2025
మహిళల్లో ఫైనాన్షియల్ లిటరసీ పెంచాలని..

మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం లేకపోవడం కలిగే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఆర్థిక విషయాలపై అవగాహన కలిగిస్తే అది భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని ఇన్నర్ గాడెస్ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించింది అనన్య పరేఖ్. చెన్నైకు చెందిన అనన్య ఇంజనీరింగ్ తర్వాత మహిళల హక్కులు, సాధికారతపై దృష్టి పెట్టింది. వ్యవహార దక్షత నుంచి వ్యాపార నిర్వహణ వరకు వర్క్షాపులు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తూ ఎందరికో దారి చూపుతున్నారు.
News November 4, 2025
రాష్ట్రం నుంచి ముగ్గురు.. అందులో ఇద్దరు మనోళ్లే

ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో ఈనెల 5 నుంచి 8వ తేది వరకు జరగనున్న నేషనల్ సైన్స్ టీచర్స్ కాన్ఫరెన్స్లో మహాదేవపూర్ బాలుర పాఠశాల సైన్స్ టీచర్ బి.ప్రభాకర్ రెడ్డి, బాలికల పాఠశాల సైన్స్ టీచర్ మడక మధు పాల్గొననున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి మొత్తం 162 మంది సైన్స్ టీచర్లు కాన్ఫరెన్స్కు ఎంపికయ్యారు. కాగా, తెలంగాణ నుంచి ఎంపికైన ముగ్గురిలో ఇద్దరు మన మహాదేవపూర్ ఉపాధ్యాయులే కావడం గర్వకారణం.


