News March 14, 2025
సిద్దిపేట జిల్లాలో బాలిక ఆత్మహత్య

జగదేవ్పూర్ మండలం మునిగడప గ్రామంలో కడుపునొప్పి భరించలేక బాలిక ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన నర్ర బాలేశం, నాగలక్ష్మి దంపతుల కుమార్తె ప్రవళిక(13) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. రెండు రోజుల క్రితం బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లి నిన్న తిరిగొచ్చింది. కడుపునొప్పి వస్తుందని తల్లికి చెప్పి ఇంట్లోకి వెళ్లి ఉరేసుకుంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News March 20, 2026
‘పిరికిపందలు’.. నాటో దేశాలపై ట్రంప్ ఫైర్!

ఇరాన్పై పోరులో నాటో దేశాలు భాగం కాకపోవడంపై US అధ్యక్షుడు ట్రంప్ మరోసారి విమర్శలు గుప్పించారు. US లేకపోతే నాటో ఎందుకూ పనికిరాదని విమర్శించారు. ఆయిల్ ధరలపై ఆ దేశాలు ఫిర్యాదు చేస్తున్నాయి కానీ హార్ముజ్ను క్లియర్ చేసేందుకు మాత్రం సహాయపడట్లేదన్నారు. హార్ముజ్ను క్లియర్ చేయడం ఆ దేశాలకు సులువైన పనేనని అన్నారు. ఈ వైఖరిని గుర్తుపెట్టుకుంటానన్న ట్రంప్.. నాటో దేశాలను పిరికిపందలుగా అభివర్ణించారు.
News March 20, 2026
జనగామ: కాంట్రాక్ట్ ఉద్యోగాలకు 201 దరఖాస్తులు

కేంద్ర ప్రభుత్వం ఆదేశానుసారం జనగణన-2026 విధులకు కాంట్రాక్ట్ పద్ధతిలో అర్హులైన వారి నుంచి దరఖాస్తుల స్వీకరణ గడువు నేటితో ముగిసింది. మొత్తం 201 మంది ఉద్యోగార్థులు ఇందుకు దరఖాస్తు చేసినట్లు కలెక్టరేట్ సంబంధిత శాఖ అధికారులు తెలిపారు. అర్హులైన వారిని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఎంపిక చేసి 18 నెలల పాటు జనగణన విధులు అప్పగించనున్నారు.
News March 20, 2026
రంజాన్ పండుగను శాంతియుతంగా జరుపుకోవాలి: కలెక్టర్ ప్రతిమా సింగ్

పవిత్ర రంజాన్ పండుగను ముస్లిం సోదరులందరూ శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆకాంక్షించారు. రంజాన్ మాసం క్రమశిక్షణ, దాతృత్వం, మత సామరస్యానికి ప్రతీక అని ఆమె పేర్కొన్నారు. నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు చేపట్టిన ప్రతి ఒక్కరికీ ఈ పండుగ సుఖసంతోషాలను, ఆరోగ్యాన్ని చేకూర్చాలని ఆమె శుభాకాంక్షలు తెలిపారు.


