News March 14, 2025
జిల్లాలో ఎక్కడెక్కడ ఎంత ఎండ..!

జగిత్యాల జిల్లాలో గురువారం గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా నమోదయ్యాయి. అత్యధికంగా వెల్గటూర్, ఐలాపూర్లో 40.3℃, పెగడపల్లె, సిరికొండ, గొదురు, గొల్లపల్లె 40.2, రాఘవపేట 40.1, నేరెల్లా, బుద్దేష్పల్లి 40, రాయికల్, అల్లీపూర్ 39.9, జైన 39.8, సారంగాపూర్ 39.7, మెట్పల్లె, కొల్వాయి 39.6, మల్యాలలో 39.5, మారేడుపల్లి 39.4, మేడిపల్లె, జగిత్యాల 39.3, మన్నెగూడెం, మల్లాపూర్ 39.2, తిరమలాపూర్ 39.1, పూడూరులో 39℃గా నమోదైంది.
Similar News
News March 21, 2026
Wah.. నగరమంతా నోరూరించే సువాసన

రంజాన్ అనగానే షీర్ ఖుర్మా గుర్తొస్తుంది. నగరమంతా దీని గుమగుమలతో నిండిపోతుంది. గల్లీల్లో దోస్తులందరినీ ఇంటికి పిలిచి దావత్ ఇచ్చి ఆఖరున షీర్ ఖుర్మాతో నోరు తీపి చేస్తారు. ఈ షీర్ ఖుర్మాకు ప్రత్యేకత ఉంది. పాలను బాగా మరిగించి ఖర్జూరాల తీపితో చేసే ఈ డెజర్ట్ తక్షణ శక్తినిస్తుంది. దీంట్లోని కాల్షయం, ప్రోటీన్లు ఎముకలను బలపరిచి, జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయని నిపుణుల మాట.
News March 21, 2026
6న అనంతపురం JNTU స్నాతకోత్సవం

అనంతపురం JNTU 15వ స్నాతకోత్సవాన్ని ఏప్రిల్ 6న నిర్వహిస్తున్నట్లు వీసీ హంచాటే సుదర్శన రావు తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి యూజీ, పీజీ, పీహెచ్.డీ పట్టాలను అందజేస్తామన్నారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఛాన్స్లర్ హోదాలో స్నాతకోత్సవాన్ని హాజరుకానున్నారు.
News March 21, 2026
ఇరాన్పై దాడులకు US సాయం కోరిందా? భారత్ స్పందనిదే..

ఇరాన్పై బాంబు దాడి చేసేందుకు భారత మిలిటరీ స్థావరాలను వాడుకునేందుకు అమెరికా అనుమతి కోరిందన్న ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. ఇందులో నిజం లేదని, ఇలాంటి వార్తలను నమ్మవద్దని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కాగా ఇరు దేశాల మధ్య ఉన్న లాజిస్టిక్స్ ఎక్స్ఛేంజ్ మెమొరాండం ఆఫ్ అగ్రిమెంట్(LEMOA) ప్రకారం భారత్ దీనికి అనుమతి ఇవ్వొచ్చని ఓ జర్నలిస్ట్ చేసిన పోస్టుకు MEA ఈ విధంగా స్పందించింది.


