News March 14, 2025

పల్నాడు: రేపటి నుంచి ఒంటి పూట బడులు

image

పల్నాడు జిల్లాలో రేపటి నుంచి ఒంటిపూట బడులను అమలు చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారిణిచంద్రకళ శుక్రవారం తెలిపారు. ఏప్రిల్ 23 వరకు ప్రభుత్వ, ప్రైవేటు బడుల్లో ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు జరుగుతాయన్నారు. 10వ తరగతి పరీక్షలు జరిగే పాఠశాలల్లో పరీక్షలు ముగిసే వరకు మధ్యాహ్నం 1:15 నుంచి 5 గంటల వరకు తరగతులు జరుగుతాయన్నారు. కచ్చితంగా ప్రైవేటు పాఠశాలల్లో ఒంటిపూట బడులు అమలు చేయాలన్నారు.

Similar News

News March 15, 2025

ఇవాళ అసెంబ్లీకి సీఎం రేవంత్

image

TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యావాదాలు తీర్మానంపై సమాధానం ఇవ్వనున్నారు. ఉ.10 గంటలకు ఉభయసభలు ప్రారంభం కానున్నాయి. గవర్నర్‌పై విపక్షాల విమర్శల నడుమ ఆయన ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఇవాళ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరు మార్పుపై సభలో బిల్లును ప్రవేశపెట్టనున్నారు. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీగా పేరు మార్చనున్నట్లు సమాచారం.

News March 15, 2025

కొత్త కెప్టెన్లు.. ఏం చేస్తారో?

image

ఐపీఎల్ 2025లో అన్ని జట్లకు కెప్టెన్లు ఖరారయ్యారు. కొత్తగా పంజాబ్‌కు శ్రేయస్, KKRకు రహానే, లక్నోకు పంత్, ఢిల్లీకి అక్షర్, ఆర్సీబీకి రజత్ పాటీదార్‌ను సారథులుగా నియమించారు. ఇందులో KKR మినహా మిగతా జట్లకు ఇప్పటివరకు ఒక్క కప్పు రాలేదు. గత సీజన్‌లో కోల్‌కతా‌ను విన్నర్‌గా నిలిపిన అయ్యర్ ఈ సారి పంజాబ్‌తో చేరడం ఆసక్తికరంగా మారింది. మరి కొత్త కెప్టెన్ల రాకతోనైనా ఆయా జట్ల దశ మారుతుందో చూడాలి. మీ కామెంట్?

News March 15, 2025

గద్వాల్: ఒంటిపూట బడులు.. ఒక్కో క్లాస్ ఎంతసేపంటే..?

image

నేటి నుంచి ఒంటిపూట బడుల నేపథ్యంలో ఒక్క క్లాస్ పీరియడ్ ఎంత సమయం ఉంటుందనే వివరాలను ఆయా జిల్లాల అధికారులు వెల్లడించారు. ఉదయం 8 గం.లకు 1వ బెల్, 8:05కు 2వ బెల్, 8:15- 8:55 వరకు 1వ పీరియడ్, 8:55- 9:35 వరకు 2వ పీరియడ్, 9:35- 10:15 వరకు 3వ పీరియడ్, 10:15- 10:30 గంటలకు బ్రేక్. 10:30 గం. నుంచి 11:10 వరకు 4వ పీరియడ్, 11:10 గం. నుంచి 11:50 వరకు 5వ పీరియడ్, 11:50 గం. నుంచి 12:30 వరకు చివరి పీరియడ్‌. SHARE IT

error: Content is protected !!