News March 14, 2025

సీతానగరం: ‘ఎలిఫెంట్ జోన్ మా కొద్దు’

image

నివాస ప్రాంతాల సమీపంలో ఎలిఫెంట్ జోన్ మా కొద్దని సీపీఎం నాయకులు కొల్లు గంగు నాయుడు డిమాండ్ చేశారు. సీతానగరం మండలంలో ఎలిఫెంట్ జోన్ పెట్టడం అంటే ప్రభుత్వ వైఫల్యమేనని అన్నారు. ఎక్కడ నుంచి వచ్చిన ఏనుగులను అక్కడికి తరలించకుండా జనావాసాల మధ్య పెట్టడం సరైన విధానం కాదని అన్నారు. ప్రస్తుతం చేస్తున్న ఎలిఫెంట్ జోన్ పనులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

Similar News

News March 21, 2026

తరిగొప్పుల రైల్వే స్టేషన్‌లో గుర్తుతెలియని యువకుడి మృతి

image

కృష్ణా జిల్లా తరిగొప్పుల రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారమ్ వద్ద గుర్తుతెలియని యువకుడు(సుమారు 25-30 ఏళ్లు) రైలు ఢీకొని మృతి చెందాడు. మృతుని వివరాలు తెలిసిన వారు వెంటనే గుడివాడ రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వాలని భీమవరం రైల్వే జీఆర్‌పీ సుబ్రహ్మణ్యం కోరారు. మృతుని ఆచూకీ తెలిస్తే 92475 85713, 99890 29379 ఫోన్ నంబర్లను సంప్రదించాలని విన్నవించారు.

News March 21, 2026

సిద్దిపేటలో యాక్సిడెంట్.. ఐదేళ్ల బాలుడి మృతి

image

సిద్దిపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి చెందాడు. కామారెడ్డి జిల్లాకు చెందిన రాములు, భారతి దంపతులకు వైష్ణవి, గంగారాం(5) పిల్లలు ఉన్నారు. ఉపాధి కోసం వచ్చిన రాములు ఫ్యామిలీతో కలిసి సిద్దిపేట 16వ వార్డులో ఉంటున్నారు. శుక్రవారం గంగారాం తోటి పిల్లలతో కలిసి ఆడుకోవడానికి వెళ్తుండగా ఆటో ఢీకొట్టింది. సిద్దిపేట ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బాలుడు మృతిచెందాడు. పోలీసులు విచారణ చేపట్టారు.

News March 21, 2026

ఏలూరు:ఈతకు వెళ్లి మరణించిన ఇద్దరు మృతదేహాలు లభ్యం

image

కుక్కునూరు, వేలేరు గ్రామ పరిధిలోని గోదావరి నదిలో 7 యువకులు ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తూ ఐదుగురు మృతి చెందారు.ఈ ఘటనలో ముగ్గురు మృతదేహాలను శుక్రవారం గుర్తించారు.SDRF,EDRF ప్రత్యేక బృందాలను పోలవరం డిఎస్పి వెంకటేశ్వరరావు ఏర్పాటు చేసి గాలింపు చర్యలను చేపట్టగా ఇద్దరూ మృతదేహాలను శనివారం గుర్తించారు. సతీష్ కుమార్ మదనపల్లి, తేజాన్న ఉయ్యూరు గ్రామాలకు చెందిన వ్యక్తులుగా గుర్తించామన్నారు.