News March 14, 2025
పిఠాపురం: డూప్లికేట్ కాకుండా జనసేన మీడియా పాస్లు

మరికొద్ది గంటలో జనసేన ఆవిర్భావ సభ జరుగనుంది. అయితే కొంతమంది మీడియా ముసుగులో హడావుడి చేస్తున్నారు.ఈ నేపథ్యం పురస్కరించుకుని ఎలాంటి డూప్లికేట్ పాస్లు తయారు చేయకుండా ఉండేందుకు హాలోగ్రామ్తో కూడిన మీడియా పాసులు జారీ చేశారు. అక్రిడేషన్ కార్డులు ఉన్నవారికి మాత్రమే మీడియా పాస్ లిస్టు కలర్ జిరాక్స్ లేదా డూప్లికేట్ తయారు చేయకుండా హాలోగ్రామ్ పెట్టారు. దీనిపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
Similar News
News January 18, 2026
జాతీయ స్థాయి కబడ్డీకి పాలమూరు విద్యార్థినులు

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) అండర్-19 విభాగంలో జిల్లాకు చెందిన శివాని, భవాని, మౌనిక జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు. హిమాచల్ ప్రదేశ్లో రేపటి నుంచి జరిగే ఈ టోర్నీలో వీరు పాల్గొంటారని ఎస్జీఎఫ్ కార్యదర్శి శారదాబాయి తెలిపారు. పాలమూరు క్రీడామణులు జాతీయ స్థాయికి ఎంపిక కావడం పట్ల ఉపాధ్యాయులు, గ్రామస్థులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు.
News January 18, 2026
వనదేవతలను దర్శించుకున్న డీజీపీ

మేడారం సమ్మక్క, సారలమ్మను డీజీపీ శివధర్ రెడ్డి దర్శించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఆయన మేడారం చేరుకుని, వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు స్థానిక ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ మేడారం భద్రత, క్రౌడ్ కంట్రోల్ తదితర విషయాలను కమాండ్ కంట్రోల్ రూమ్లో డీజీపీకి వివరించారు. మేడారం జాతర విజయవంతం చేయాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు.
News January 18, 2026
ఆ 88 గంటలు.. తీవ్రతను మాటల్లో వర్ణించలేం: రాజ్నాథ్

గతేడాది పాక్ ఉగ్ర శిబిరాలపై చేపట్టిన ఆపరేషన్ సిందూర్ 88 గంటలు కొనసాగిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ చెప్పారు. అప్పుడు ఎదుర్కొన్న తీవ్రతను మాటల్లో వర్ణించలేమని అన్నారు. ఇలాంటి సమయాల్లో ప్రతి నిమిషం, నిర్ణయం చాలా కీలకమని తెలిపారు. ‘ప్రపంచంలో యుద్ధ రీతులు మారుతున్నాయి. కొత్త పద్ధతులు వస్తున్నాయి. ఇప్పుడు అవి సరిహద్దులకే పరిమితం కాదు’ అని నాగ్పూర్లో మందుగుండు సామగ్రి ప్లాంట్ ప్రారంభోత్సవంలో అన్నారు.


