News March 14, 2025

వికారాబాద్: యువత చట్టాలపై అవగాహన కల్పించుకోవాలి: జడ్జి 

image

యువత చట్టాలపై అవగాహన కల్పించుకోవాలని జిల్లా సేవాధికార సంస్థ సెక్రటరీ జడ్జి శీతాల్ తెలిపారు. వికారాబాద్ పట్టణంలోని శ్రీ అనంతపద్మనాభ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జడ్జి శీతాల్ మాట్లాడుతూ.. చట్టాలపై అవగాహన కల్పించుకుని బాల్యవివాహాల నిర్మూలనకు యువత కృషి చేయాలన్నారు.

Similar News

News March 19, 2026

అమలాపురం: కలెక్టరేట్‌లో ఉగాది వేడుకలు

image

అమలాపురం కలెక్టరేట్‌లో గురువారం శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఉగాది ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త ఆశలకు నాంది పలుకుతుందని సమగ్ర శిక్ష ఏపీసీ, ఆర్డీవో జి మమ్మీ పేర్కొన్నారు. వేద పఠనం, పంచాంగ శ్రవణం నిర్వహించిన వేద పండితులను అధికారులు అధికారికంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రభుత్వ అధికారులు, సిబ్బంది పాల్గొని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

News March 19, 2026

సహజీవన జంటలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. గుజరాత్‌లో UCC బిల్

image

గుజరాత్ ప్రభుత్వం అసెంబ్లీలో UCC(యూనిఫామ్ సివిల్ కోడ్) బిల్లును ప్రవేశపెట్టింది. దీని ప్రకారం సహజీవనంలో ఉండే జంటలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నెలలోగా ఇలా చేయకపోతే 3M జైలు శిక్ష/₹10K ఫైన్, ఒక్కోసారి రెండూ విధిస్తారు. బలవంతం/మోసపూరితంగా వ్యవహరిస్తే ఐదేళ్ల జైలు శిక్ష ఉంటుంది. మత ఆధారిత చట్టాల స్థానంలో పెళ్లి, విడాకులు, భరణం, వారసత్వం, దత్తత విషయంలో పౌరులందరికీ ఒకే రూల్స్ వర్తిస్తాయి.

News March 19, 2026

పీసీసీ అంశంపై మంత్రి కోమటిరెడ్డి స్పష్టత

image

పీసీసీ అధ్యక్ష పదవి మార్పుపై వస్తున్న వార్తలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించారు. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌ గౌడ్‌పై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. ఆయన సారథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయం సాధించిందని గుర్తుచేశారు. జగ్గారెడ్డి పనితీరును ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవద్దని అయన తెలిపారు.