News March 14, 2025

ఇబ్రహీంపట్నంలో విద్యుత్ ఉద్యోగి మృతి  

image

ఇబ్రహీంపట్నంలో విద్యుత్ ఉద్యోగి మృతిచెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు మణికుమార్ అనే వ్యక్తి విద్యుత్ ఉద్యోగిగా గుర్తించామన్నారు. కుటుంబ కలహాలతో వీటీపీఎస్ కూలింగ్ కెనాల్ కాలువలో దూకి మృతిచెందాడని చెప్పారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News March 14, 2025

రేపు అహోబిలానికి చీఫ్ సెక్రటరీ విజయానంద్ రాక

image

ఏపీ చీఫ్ సెక్రటరీ కే.విజయనంద్ శనివారం అహోబిలం క్షేత్రానికి రానున్నట్లు మండల తహశీల్దార్ జ్యోతి రత్నకుమారి తెలిపారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. అహోబిలం బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకునేందుకు చీఫ్ సెక్రటరీ, కలెక్టర్ రాజకుమారి రానున్నట్లు తెలిపారు. చీఫ్ సెక్రటరీ విజయానంద్ రాక సందర్భంగా ప్రోటోకాల్ అనుసరించి అన్ని ఏర్పాట్లు చేసినట్లు తహశీల్దార్ తెలిపారు.

News March 14, 2025

నా కంటే మా అన్నయ్యలను నాన్న ఎక్కువ కొట్టేవారు: పవన్

image

AP: సెకండ్ షో సినిమాకు వెళ్లి తన తండ్రి చేతిలో తిట్లు తిన్న తాను కోట్లమందికి సంబంధించిన పాలిటిక్స్ చేయడం భగవంతుడి రాతేనని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అన్నారు. ‘ఓ రోజు సెకండ్ షోకు వెళ్లొచ్చేసరికి మా నాన్న కోపంతో ఉన్నారు. ఆయన కొడతారని భయపడ్డా. కానీ నేను హీరోనని, 4 సినిమాలు హిట్లయ్యాయని చెప్పా. ఇంకా ఎక్కువ తిట్టారు. ఆశ్చర్యం ఏమిటంటే నా కంటే మా అన్నయ్యలను ఆయన ఎక్కువ కొట్టేవారు’ అని చెప్పుకొచ్చారు.

News March 14, 2025

ఫ్యాన్స్‌కి CSK జట్టు ఫ్రీ బస్!

image

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తమ అభిమానుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. చెన్నైలో జరిగే మ్యాచులు ఆరంభమయ్యే 3 గంటల ముందు ప్రభుత్వ బస్సుల్లో(నాన్ ఏసీ) ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించింది. ఈ సీజన్ అంతా ఇది వర్తించనుంది. దీంతో ఫ్యాన్స్ నుంచి హర్షం వ్యక్తమవుతోంది. అభిమానులకు సీఎస్కే చాలా ప్రేమను తిరిగిస్తోందంటూ ఎల్లో ఆర్మీ పొగడ్తలు కురిపిస్తోంది.

error: Content is protected !!