News March 14, 2025
MHBD: బైకులో పాము కలకలం (PHOTO)

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండల కేంద్రంలోని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శివాజీ బైక్లో పాము చేరింది. శివాజీ విధులు నిర్వహిస్తున్న సమయంలో బైక్లో పాము దూరింది. వెంటనే పైకి లేవగా, అప్రమత్తమైన అధికారి బైక్ను పక్కకు నిలిపాడు. సుమారు 2 గంటల తర్వాత పాము కిందకు దిగివెళ్లిపోవడంతో ఆయన ఊపిరిపీల్చుకున్నారు.
Similar News
News March 14, 2025
ఫ్యాన్స్కి CSK జట్టు ఫ్రీ బస్!

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తమ అభిమానుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. చెన్నైలో జరిగే మ్యాచులు ఆరంభమయ్యే 3 గంటల ముందు ప్రభుత్వ బస్సుల్లో(నాన్ ఏసీ) ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించింది. ఈ సీజన్ అంతా ఇది వర్తించనుంది. దీంతో ఫ్యాన్స్ నుంచి హర్షం వ్యక్తమవుతోంది. అభిమానులకు సీఎస్కే చాలా ప్రేమను తిరిగిస్తోందంటూ ఎల్లో ఆర్మీ పొగడ్తలు కురిపిస్తోంది.
News March 14, 2025
పార్వతీపురం: రేపటి నుంచి ఒంటిపూట బడులు

రేపటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయని డీఈఓ ఎన్. తిరుపతి నాయుడు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. రేపటి నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు తరగతులు ఉంటాయన్నారు. పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్న పాఠశాలల్లో పరీక్షలు ముగిసేంతవరకు మధ్యాహ్నం 1.15 నుంచి సాయంత్రం 5గంటల వరకు తరగతులు ఉంటాయన్నారు.
News March 14, 2025
కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు

➤ 172 పరీక్షా కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు
➤ కర్నూలు జిల్లా వాసికి ఆల్ ఇండియా 199వ ర్యాంకు
➤ నంద్యాల: వైసీపీ నేతపై హత్యాయత్నం.. 9మంది టీడీపీ నేతలపై కేసు
➤ స్త్రీల వేషంలో పురుషులు.. రతీ మన్మథులకు పూజలు
➤ మంత్రాలయంలో కన్నడ సీరియల్ షూటింగ్
➤ ఆదోని: ఇన్ స్టాగ్రామ్ లో ప్రేమ.. పెద్దల సమక్షంలో పెళ్లి
➤ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన పెద్దకడబురు విద్యార్థులు
➤వైఎస్ జగన్ పై సోమిశెట్టి తీవ్ర విమర్శలు