News March 23, 2024
అల్లవరం: వడదెబ్బతో టాటా ఉద్యోగి మృతి

అల్లవరం మండలం ఓడలరేవు ఓఎన్జీసీ అన్షోర్ టెర్మినల్లో పనిచేస్తున్న అదే గ్రామానికి చెందిన కొల్లు వెంకటరమణారావు(55) శనివారం వడదెబ్బతో మృతిచెందాడు. కుటుంబీకులు పోలీసులకు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. టాటా సంస్థలో స్టోర్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్న రమణారావు కి.మీ దూరం నడిచి వెళ్లి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడన్నారు. బెండమూర్లంక పీహెచ్సీకి తరలించగా అప్పటికే మృతి చెందారన్నారు.
Similar News
News September 27, 2025
రాజమండ్రి: లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్

రాజమండ్రిలోని పలు లోతట్టు ప్రాంతాలను జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం సందర్శించారు. ఆల్కాట్ గార్డెన్, గౌతమీ ఘాట్ వద్ద కొన్ని కుటుంబాలు ముంపుకు గురయ్యే అవకాశం ఉన్నట్లు గుర్తించారు. లోతట్టు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్ సూచించారు.
News September 27, 2025
‘ఖాదీ సంత’ విజయవంతానికి బీజేపీ సన్నాహక సమావేశం

గాంధీ జయంతిని పురస్కరించుకుని రాజమండ్రి సుబ్రహ్మణ్య మైదానంలో నిర్వహించనున్న “ఖాదీ సంత” కార్యక్రమంపై బీజేపీ శనివారం సన్నాహక సమావేశం నిర్వహించింది. రాజమండ్రి బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో ఈ భేటీ జరిగింది. ఖాదీ సంత విజయవంతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై పలువురు సూచనలు చేశారు. ప్రధాని తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నాయకులు తీర్మానించారు.
News September 27, 2025
GST ప్రయోజనాలపై అవగాహన కల్పించండి: జేసీ

GST సంస్కరణల మేలును క్షేత్రస్థాయి ప్రజలకు చేర్చడానికి విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని జేసీ, జిల్లా GST నోడల్ అధికారి వై.మేఘ స్వరూప్ తెలిపారు. శనివారం రాజమండ్రి కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ‘సూపర్ GST – సూపర్ సేవింగ్స్’ పేరిట నెల రోజులపాటు ఈ ప్రచారాన్ని నిర్వహించాలని వై.మేఘ స్వరూప్ వెల్లడించారు.