News March 14, 2025
‘పశు బీమాను సద్వినియోగం చేసుకోవాలి’

పశు బీమాను పాడిరైతులు సద్వినియోగం చేసుకోవాలని పశుసంవర్థకశాఖ జిల్లా అధికారి రామ్మోహన్రావు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పశువులకు 80శాతం రాయితీతో బీమా అందిస్తున్నాయన్నారు. తెల్ల రేషన్ కార్డున్న పాడి రైతులంతా ఈ బీమాను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రెండేళ్ల కాలంలో 10,231 పశువులకు బీమా చేయగా, మృతి చెందిన 179 పశువులకు మంజూరైన రూ.52,98,000 బీమా నగదును రైతుల ఖాతాల్లో జమ చేసామన్నారు.
Similar News
News January 21, 2026
కడప: పోలీసుల నిర్ణయాలు ఆచరణలోకి రావా.!

రోడ్డు ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయని పోలీసులు నో హెల్మెట్ – నో పెట్రోల్ అంటూ కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. అంతే కాకుండా ఇటీవల రోడ్డు భద్రతా వారోత్సవాలు అంటూ బైక్ ర్యాలీలు చేపడుతున్నారు. వీరు మాత్రం హెల్మెట్ పెట్టుకొని ర్యాలీలు చేస్తుంటే.. పలు రాజకీయ, ప్రజా, కుల, మత సంఘాల నాయకులు హెల్మెట్ లేకుండా ర్యాలీలు చేస్తున్నారు. ఇలా ఉంటే అనుకున్న ఫలితాలు ఎలా వస్తాయని ప్రజలు చర్చించుకుంటున్నారు.
News January 21, 2026
మెదక్: ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై దాడి చేయడమే ప్రజాపాలనా? హరీష్ రావు

అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడిపై నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి దాడిని మాజీ మంత్రి హరీశ్రావు తీవ్రంగా ఖండించారు. విజయుడిపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి దుర్భాషలాడుతూ చేయి చేసుకోవడం దారుణమన్నారు. అప్రజాస్వామికమని విమర్శించారు. ప్రజల చేత ఎన్నిక కాబడిన ప్రతినిధిపై దాడి అంటే ప్రజల తీర్పుపైనే దాడి అని స్పష్టం చేశారు. విజయుడిపై ఎంపీ మల్లు రవి దాడిని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.
News January 21, 2026
సీఎంపై ఫిర్యాదు చేసిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే

మాజీ సీఎం కేసీఆర్తో పాటు తమ పార్టీని లక్ష్యంగా చేసుకొని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మీ అన్నారు. సీఎంపై బుధవారం ASF ఎస్పీ నిఖిత పంత్కు ఫిర్యాదు చేశారు. ఖమ్మంలో జరిగిన బహిరంగ సభలో రేవంత్రెడ్డి అభ్యంతరకర, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ తరహాలో మాట్లాడటం సరైన పద్ధతి కాదని మండిపడ్డారు.


