News March 14, 2025
HYD: 5K రన్కు హాజరు కావాలని వినతి

ఆదివారం ఉదయం 6 గంటలకు ఆల్విన్కాలనీ 124 డివిజన్ పరిధిలోని తులసి వనంలో అవని ట్రస్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 5K రన్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని మంత్రులు జూపల్లి కృష్ణరావు, పొన్నం ప్రభాకర్ను కలసి అవని ట్రస్ట్ ఛైర్మన్ శిరీష సత్తూర్ ఆహ్వానించారు. ఆదివారం ఉ.6 గంటల కార్యక్రమం ప్రారంభమవుతుందని ఆమె వెల్లడించారు.
Similar News
News September 19, 2025
24న అంబేడ్కర్ వర్సిటీ MBA అడ్మిషన్స్ కౌన్సెలింగ్

TG: HYD అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను MBA(హాస్పిటల్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్) అడ్మిషన్ షెడ్యూల్ విడుదలైంది. ఈనెల 24న ఉదయం 9 గంటలకు CSTD బిల్డింగ్లో కౌన్సెలింగ్ ఉంటుందని విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డా.వై.వెంకటేశ్వర్లు తెలిపారు. ఐసెట్ లేదా వర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్లో పాసైనవారే అప్లై చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు www.braouonline.in సంప్రదించాలన్నారు.
News September 19, 2025
మేయర్, కమిషనర్ ప్రజలతో ఆటలాడటం తగదు: ఎమ్మెల్యే వంశీకృష్ణ

జైలు రోడ్డు ఫుడ్ కోర్ట్లో దుకాణాలను స్థానిక MLA అయిన తనకు సమాచారం ఇవ్వకుండా <<17758951>>తొలగించడం<<>>పై వంశీకృష్ణ శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్, కమిషనర్ ఒకరిపై ఒకరు నెపం వేసుకుంటూ ప్రజలతో ఆటలాడటం తగదని హెచ్చరించారు. ఫుడ్ కోర్ట్ వ్యాపారులు ఏళ్లుగా కష్టపడి దుకాణాలు నడుపుతున్నారని, ఒక్కసారిగా తొలగించడం అన్యాయం అని అన్నారు. తనకు సమాచారం ఇవ్వకుండా కౌన్సిల్లో తీర్మానం పెట్టడాన్ని తప్పుపట్టారు.
News September 19, 2025
తొలి రుతుక్రమంపై ప్రభావం చూపుతున్న వాతావరణ మార్పులు

వాతావరణ మార్పులతో తొలి రుతుక్రమం ప్రభావితం అవుతున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. బంగ్లాదేశ్కు చెందిన పరిశోధకులు 1992-93, 2019-21 సంవత్సరాల్లో జనాభా, ఆరోగ్య సర్వేల సమాచారం, నాసా వాతావరణ డేటాను విశ్లేషించి ఈ విషయాన్ని వెల్లడించారు. అధిక ఉష్ణోగ్రతలు శరీరంలో ఒత్తిడిని పెంచి, హార్మోన్లను ప్రభావితం చేస్తున్నాయి. తద్వారా ఉష్ణప్రాంతాల్లోని బాలికల్లో రుతుక్రమం ఆలస్యమవుతున్నట్లు గుర్తించారు.