News March 14, 2025
మేడ్చల్: కొత్త మున్సిపాలిటీలలో విలీనం అయ్యే గ్రామాలు (2/2)

మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలో అలియాబాద్, మూడుచింతలపల్లి, ఎల్లంపేట పేర్లతో మూడు కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేయనుంది. ఎల్లంపేట మున్సిపాలిటీలో.. శ్రీరంగవరం, బండమాధరం, నూతనకల్, మైసిరెడ్డిపల్లి, కోనాయిపల్లి, సోమారం, రావల్కోల్, కండ్లకోయ, రాజ్బొల్లారం, ఘన్పూర్, గోసాయిగూడ గ్రామాలు విలీనం కానున్నాయి. ఈ నెల 17న అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టనున్నారు.
Similar News
News January 22, 2026
దుగ్గిరాల: ప్రియుడిపై మోజు.. బిర్యానీలో నిద్రమాత్రలు కలిపి భర్తను చంపింది

దుగ్గిరాలలో దారుణం జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. చిలువూరుకు చెందిన ఉల్లిపాయల వ్యాపారి శివనాగరాజు, అతని భార్య లక్ష్మీ మాధురి చేతులో హత్యకి గురయ్యాడు. ఆమె ఓ సినిమా హాల్లో టికెట్ కౌంటర్లు పని చేసే సమయంలో హైదరాబాద్కి చెందిన గోపి అనే వ్యక్తితో పరిచయమై వివాహేతర సంబంధానికి దారి చేసింది. భర్త అడ్డు తొలగించుకోవాలని బిర్యానీలో నిద్రమాత్రలు కలిపింది. ఆపై ప్రియుడితో కలిసి దుండుతో ఊపిరాడకుండా చేసి చంపింది.
News January 22, 2026
వరంగల్: జంతుగణన సర్వే ప్రారంభం..!

అటవీ ప్రాంతాల్లో జంతువుల గణన కోసం అటవీ శాఖ అధికారులు సర్వేకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 19 నుంచి 24 వరకు నిర్వహించే ఈ సర్వేలో జిల్లా వ్యాప్తంగా 16 టీంలు పాల్గొంటున్నాయి. ఒక్కో టీంలో ముగ్గురు సిబ్బంది ఉండగా,
ఎం-స్క్రిప్ట్ యాప్ ద్వారా ఆన్లైన్ పద్ధతిలో వివరాలు నమోదు చేస్తున్నారు. మాంసాహార, శాఖాహార జంతువుల పాదముద్రలు, విసర్జన సేకరించి విశ్లేషణకు పంపి జంతువుల సంఖ్య పెరిగిందా, తగ్గిందా తెలియనుంది.
News January 22, 2026
వరంగల్ కలెక్టర్ చొరవ.. విద్యార్థికి అందిన సర్టిఫికెట్లు

ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల సాకుతో కళాశాల యాజమాన్యం ఆపిన సర్టిఫికెట్లు కలెక్టర్ చొరవతో విద్యార్థికి చేరాయి. వరంగల్కు చెందిన విక్రమ్ బీటెక్ పూర్తి చేసినా, పత్రాలు అందక ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నాడని అతడి తండ్రి రమేశ్ ‘ప్రజావాణి’లో కలెక్టర్ సత్య శారదకు మొరపెట్టుకున్నారు. తక్షణమే స్పందించిన కలెక్టర్, కళాశాల యాజమాన్యంతో మాట్లాడి సర్టిఫికెట్లు ఇప్పించారు. కలెక్టర్కు విద్యార్థి కృతజ్ఞతలు తెలిపారు.


