News March 14, 2025
అశ్వారావుపేట మండలంలో రోడ్డు ప్రమాదం

అశ్వారావుపేట మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. తిరుమలకుంట గ్రామ శివారు ఆంజనేయస్వామి గుడి దగ్గర రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓవ్యక్తి మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News September 19, 2025
నిర్మల్: క్రైస్తవ మైనారిటీల సమస్యలపై సమీక్ష

రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ కమిషన్ ఛైర్మన్ దీపక్ జాన్, కలెక్టర్ అభిలాష అభినవ్ సమక్షంలో కలెక్టరేట్లో కార్యాలయంలో క్రైస్తవ మైనారిటీల సమస్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. అర్హులైన క్రైస్తవులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తద్వారా వారు అభివృద్ధి సాధించవచ్చన్నారు.
News September 19, 2025
SKU డిగ్రీ ఫలితాలు విడుదల

శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అనుబంధ కళాశాలల డిగ్రీ రెండో, నాలుగో సెమిస్టర్ ఫలితాలను ఇన్ఛార్జి ఉపకులపతి ప్రొఫెసర్ అనిత విడుదల చేశారు. నాలుగో సెమిస్టర్లో 7,798 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 4,250 మంది ఉత్తీర్ణులయ్యారు. రెండో సెమిస్టర్లో 7,760 మంది పరీక్షలు రాసి 3,535 విద్యార్థులు పాస్ అయ్యారు. ఈ కార్యక్రమంలో రిజిస్టార్ డాక్టర్ రమేశ్ బాబు, పరీక్షల విభాగం డైరెక్టర్ జీవీ రమణ పాల్గొన్నారు.
News September 19, 2025
తమిళనాట పట్టు కోసం రసపట్టుగా పాలిట్రిక్స్!

వచ్చే వేసవిలో ఎన్నికలున్న తమిళనాడులో ఇప్పటికే రాజకీయం వేడెక్కింది. ఇన్నాళ్లూ పాలు నీళ్లలా ఉన్న DMK-కాంగ్రెస్ల స్నేహం చెడినట్లుంది. DMK తమను చెరుకుగడలా వాడుకుని పీల్చి పిప్పి చేసి వదిలేసిందని TN-PCC ex చీఫ్ KS అళగిరి ఆరోపించారు. DMKతో కలవాలంటే ఈసారి కాంగ్రెస్కు మంత్రి పదవులు, గతంలో కంటే ఎక్కువ సీట్లు కావాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం అవసరమైతే TVK (విజయ్)తో పొత్తుకూ వెళ్తామని సంకేతాలిచ్చారు.