News March 14, 2025
NGKL: జిల్లాలో భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలు..

నాగర్ కర్నూల్ జిల్లాలో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగాయి. మార్చ్ నెల మొదటి వారంలోని ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరుకోవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జిల్లాలోని తెలకపల్లి మండల కేంద్రంలో గడిచిన 24 గంటల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కల్వకుర్తి ప్రాంతంలో శుక్రవారం ఉష్ణోగ్రతలు 39 డిగ్రీలకు చేరుకున్నాయి.
Similar News
News March 15, 2025
నంద్యాల: అధిక ధరలకు స్టాంపుల విక్రయాలు

నంద్యాలలో అధిక ధరలకు స్టాంపుల విక్రయాలు జరుగుతున్నాయని వినియోగదారులు వాపోతున్నారు. రూ.100 స్టాంప్ రూ.300 విక్రయాలు చేస్తూ అందినకాడికి దోచుకుంటున్నారని తెలిపారు. ఇందులో కామన్ సర్వీస్ స్టాంప్ సెంటర్లు, స్టాంప్ వెండర్లు కీలక పాత్ర వహిస్తున్నారు. ఒక రింగుగా మారి అందరూ ఒకటే ధరలకు విక్రయాలు చేస్తున్నారని, ఈ విషయం అధికారులకు తెలిసినా చర్యలు మాత్రం శూన్యమని వినియోగదారులు తెలిపారు.
News March 15, 2025
శక్తి యాప్ పట్ల అవగాహన కల్పించండి: ఎస్పీ

మహిళలు, అమ్మాయిల భద్రత కోసం ప్రభుత్వం రూపొందించి అమల్లోకి తీసుకొచ్చిన శక్తి యాప్ పట్ల జిల్లాలో విస్తృతంగా అవగాహన చేయాలని పోలీసు అధికారులు, శక్తి టీమ్స్కు ఎస్పీ జగదీశ్ ఆదేశాలు జారీ చేశారు. ప్రతి మహిళ తమ ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసుకుని, ఆపద సమయంలో పోలీసు వారి తక్షణ సహాయం పొందేలా చైతన్యం చేయాలన్నారు. మహిళలపై జరిగే వేధింపులు, అత్యాచారాలు, ఇతర హింసాత్మక ఘటనలను నివారించవచ్చన్నారు.
News March 15, 2025
పార్వతీపురం: ‘మహిళలు, చిన్నారుల రక్షణకు శక్తి టీంలు ఏర్పాటు’

మహిళలు, చిన్నారుల రక్షణకు శక్తి టీంలు ఏర్పాటు చేశామని ఎస్పీ ఎస్. వి మాధవ్ రెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం శక్తి టీం వాహనాలను పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఐదుగురు సభ్యులతో మూడు బృందాలుగా 15మందితో శక్తి టీమ్స్ ఏర్పాటు చేసామన్నారు. శక్తి యాప్ పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ప్రత్యేకంగా జిల్లాలో శక్తి టీమ్స్ను నియమించామన్నారు.