News March 14, 2025
నాతవరంలో ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి

నాతవరం మండలం చిక్కుడుపాలెం దగ్గర ట్రాక్టర్ బోల్తా పడి ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. ఈ ప్రమాదంలో కాకినాడ జిల్లా అల్లిపూడి గ్రామానికి చెందిన పెదపాత్రుని సత్తిబాబు మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ భీమరాజు ఘటనా స్థలికి వెళ్లి దర్యాప్తు చేపట్టారు. మృదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
Similar News
News November 4, 2025
సృజనాత్మకతతోనే ఉన్నత విద్య: డీఈవో దక్షిణామూర్తి

విద్యార్థులు తమలో సృజనాత్మకతను పెంచుకోవాలని డీఈవో దక్షిణామూర్తి అన్నారు. బయ్యారంలోని ఎంపీపీఎస్ పాఠశాలను తనిఖీ చేసిన ఆయన, విద్యార్థులకు కొత్త అంశాలపై నిరంతరం అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. హాజరు వివరాలు, విద్యార్థుల విద్యాసామర్థ్యాలను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం బాలు, ఉపాధ్యాయులు సంధ్యారాణి, రూప్ల నాయక్ తదితరులు పాల్గొన్నారు.
News November 4, 2025
అమరావతికి రూ.32,500 కోట్ల అదనపు రుణాలు

అమరావతి రాజధాని నగరం అభివృద్ధికి ప్రపంచ బ్యాంక్, ఏడీబీ సహా ఆర్థిక సంస్థల నుంచి భారీగా రుణాలు అందనున్నాయి. ప్రపంచ బ్యాంక్, ఏడీబీ నుంచి ₹14,000 కోట్లు రుణం అందే అవకాశం ఉంది. దీనితో పాటు, నాబ్ఫిడ్ నుంచి ₹10,000 కోట్లు, నాబార్డు నుంచి ₹7,000 కోట్లు రానున్నాయి. ఈ కొత్త నిధులతో కలిపి, సీఆర్డీఏకు ₹58,500 కోట్లు అందుబాటులోకి రానున్నాయి. CRDA ఇప్పటికే ₹91,639 కోట్ల విలువైన 112 నిర్మాణ పనులను చేస్తోంది.
News November 4, 2025
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో ఉద్యోగాలు

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(<


