News March 14, 2025
అవుట్సోర్సింగ్ ఉద్యోగాల ప్రచారం ఫేక్: ఈఓ

సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ దేవస్థానంలో అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల నియామకం జరుగుతుందనే ప్రచారాన్ని నమ్మవద్దని ఆలయ ఈఓ సుబ్బారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వాట్సాప్ /సోషల్ మీడియా గ్రూపుల్లో ఈ ప్రచారం జరుగుతుందని దేవస్థానం దృష్టికి వచ్చిందన్నారు. ఆలయానికి సంబంధించి ఎలాంటి ఉద్యోగాలు ప్రకటనలు ఇవ్వలేదని స్పష్టం చేశారు. తప్పుడు ప్రకటనలను నమ్మి నిరుద్యోగులు మోసపోవద్దని సూచించారు.
Similar News
News April 3, 2026
సింహాచలంలో ‘ఉంగరాల వేట’ వినోదం

సింహాచలం వరాహ లక్ష్మీనృసింహ స్వామి వార్షిక కళ్యాణోత్సవాల్లో భాగంగా నేడు అత్యంత ఆసక్తికరమైన ‘అంగుళీయక అన్వేషణ’ ఉత్సవం జరిగింది. భక్తికి వినోదాన్ని జోడించి స్వామివారి లీలలను కళ్లకు కట్టేలా నిర్వహించారు. కళ్యాణ సమయంలో అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన బంగారు ఉంగరం కనిపించకుండా పోయిందనే నెపంతో ఈ సరదా ఉత్సవాన్ని నిర్వహించడం ఇక్కడి అనాదిగా వస్తున్న ఆచారం.
News April 3, 2026
విశాఖ చేరుకున్న కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్

కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్నాథ్ సింగ్ శుక్రవారం పలు కార్యక్రమాలలో పాల్గొనేందుకు విశాఖ చేరుకున్నారు. విశాఖలో ఐఎన్ఎస్ డేగా వద్ద ఆయనకు ఎమ్మెల్యేలు విష్ణు కుమార్ రాజు, గణబాబు, కలెక్టర్, సీపీ స్వాగతం పలికారు. నావల్ డాక్యార్డ్లో ఐఎన్ఎస్ ‘తారాగిరి’ నౌక ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. సాయంత్రం నుంచి NSTLను సందర్శిస్తారు. సాయంత్రం 5:15 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి రాత్రి న్యూఢిల్లీకి వెళ్తారు.
News April 3, 2026
విశాఖ: ఐఐఎంవీకి అంతర్జాతీయ గుర్తింపు

విశాఖలోని గంభీరం వద్ద ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (IIMV)కి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. యూకేకు చెందిన బిజినెస్ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ నుంచి ఐదేళ్ల అక్రిడిటేషన్ దక్కింది. వ్యాపార విద్యలో నాణ్యత, సామాజిక ప్రభావానికి ఈ గుర్తింపు లభించినట్లు డైరెక్టర్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ తెలిపారు. దేశంలో కొద్ది సంస్థలకే ఈ గౌరవం లభింస్తుందన్నారు.


