News March 14, 2025
కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు

➤ 172 పరీక్షా కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు
➤ కర్నూలు జిల్లా వాసికి ఆల్ ఇండియా 199వ ర్యాంకు
➤ నంద్యాల: వైసీపీ నేతపై హత్యాయత్నం.. 9మంది టీడీపీ నేతలపై కేసు
➤ స్త్రీల వేషంలో పురుషులు.. రతీ మన్మథులకు పూజలు
➤ మంత్రాలయంలో కన్నడ సీరియల్ షూటింగ్
➤ ఆదోని: ఇన్ స్టాగ్రామ్ లో ప్రేమ.. పెద్దల సమక్షంలో పెళ్లి
➤ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన పెద్దకడబురు విద్యార్థులు
➤వైఎస్ జగన్ పై సోమిశెట్టి తీవ్ర విమర్శలు
Similar News
News March 17, 2025
కర్నూలు : ‘వారి కోసం.. ఒక్క క్షణం ఆలోచించండి’

మరి కాసేపట్లో కర్నూలు జిల్లా వ్యాప్తంగా టెన్త్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను అధికారులు సిద్ధం చేశారు. అయితే పరీక్షా కేంద్రాల వద్దకు టెన్షన్ టెన్షన్ గా చేరుకుంటున్న విద్యార్థుల కోసం ఒకసారి ఆలోచిద్దాం. వీలైతే వారిని పరీక్షా కేంద్రాల వద్దకు చేర్చి మన వంతు సాయం చేద్దాం.
News March 17, 2025
కర్నూలు: ఉరి వేసుకొని వ్యక్తి మృతి

కర్నూలు జిల్లా మంత్రాలయం మండల కేంద్రంలో ఆదివారం గుర్తు తెలియని ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామ శివారులోని మెలిగుట్ట దగ్గర ఓ చెట్టుకు ఉరి వేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. శరీరం గుర్తుపట్టని విధంగా ఉంది. మృతుని ఆచూకీ తెలిసినవారు ఎస్ఐ 9121101152కి సంప్రదించాలని సూచించారు.
News March 17, 2025
తెలుగు రాష్ట్రాల ప్రజలు కలిసి ఉండాలి: కర్నూలు కలెక్టర్

తెలుగు రాష్ట్రాల ప్రజలంతా కలిసి ఉండాలని, ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం మరువలేనిదని, రాష్ట్ర మంత్రి టీజీ భరత్, జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం పొట్టి శ్రీరాములు 124వ జయంతిని పురస్కరించుకొని జిల్లా అధికార యంత్రంలో చిల్డ్రన్స్ పార్క్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేఎంసీ కమిషనర్ పాల్గొన్నారు.