News March 15, 2025
యాదాద్రి శ్రీవారి నిత్య ఆదాయ వివరాలు

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఆదాయ వివరాలు ఆలయ ఈవో భాస్కరరావు వెల్లడించారు. శుక్రవారం 1,080 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా రూ.54,000, ప్రసాద విక్రయాలు రూ.11,78,890, VIP దర్శనాలు రూ.4,50,000, బ్రేక్ దర్శనాలు రూ.3,06,900, కార్ పార్కింగ్ రూ.4,20,870, యాదరుషి నిలయం రూ.64,160, సువర్ణ పుష్పార్చన రూ.92,316, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.29,93,218 ఆదాయం వచ్చింది.
Similar News
News March 27, 2026
ఖమ్మం: వరి కోతకు వచ్చి గుండెపోటుతో డ్రైవర్ మృతి

నేలకొండపల్లి మండలం చెరువు మాదారం గ్రామంలో శుక్రవారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది. వరి కోత మిషన్తో పనుల కోసం వచ్చిన ఓ డ్రైవర్, స్థానిక పెట్రోల్ బంక్ వద్ద ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పనుల కోసం వచ్చి అనంత లోకాలకు వెళ్లడంతో తోటి కార్మికులు కన్నీరుమున్నీరయ్యారు.
News March 27, 2026
‘వేదమందిర్’కు జ్యోతిష్కులు కావలెను!

ప్రముఖ ఆధ్యాత్మిక వేదిక ‘వేదమందిర్’ సేవలు మరింత విస్తరించేందుకు జ్యోతిష్కులను నియమించుకుంటోంది. మా లక్షలాది తెలుగు భక్తులకు సరైన మార్గదర్శనం చేసేందుకు నిపుణులైన జ్యోతిష్కులు (Astrologers) కావలెను.
– జ్యోతిషశాస్త్రంలో మంచి పట్టు
– విషయంపై స్పష్టమైన వివరణ ఇచ్చే నైపుణ్యం
మీరు జ్యోతిష్యంలో ప్రావీణ్యం ఉన్నవారైతే వెంటనే సంప్రదించండి!
<<7337592828>>Click on Whatsapp <<>>
News March 27, 2026
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా క్రికెట్ జట్ల ఎంపిక పూర్తి

ఏలూరు ఆశ్రమం మెడికల్ కళాశాల మైదానంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అండర్ 19, అండర్ 23 బాలుర క్రికెట్ జట్ల ఎంపిక జరిగింది. ఎంపిక పోటీల్లో జిల్లాకు చెందిన క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అండర్ 23 జట్టులో 23 మంది సభ్యులు, అండర్ 19 జట్టులో 16 మంది సభ్యులను సెలెక్టర్లు ఎంపిక చేశారు. వీరు త్వరలో మూలపాడులో జరగబోయే అంతర్ జిల్లాల క్రికెట్ పోటీల్లో పాల్గొంటారని సెలెక్టర్ శ్రీనివాసరాజు వెల్లడించారు.


