News March 15, 2025
విజయవాడ: ప్రభాస్ ఫ్యాన్స్కు అదిరిపోయే న్యూస్

ఈ నెల 21వ తేదీన రెబల్ స్టార్ ప్రభాస్, శృతిహాసన్ నటించిన సలార్ చిత్రాన్ని విజయవాడలో రీ రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రం విజయవాడలోని 8 థియేటర్లలో రీ రిలీజ్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. కాగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలోని యాక్షన్ సీన్లు సినీ అభిమానులను ఉర్రూతలూగించాయి.
Similar News
News March 6, 2026
అనకాపల్లి: రేకుల షెడ్ నుంచి జారిపడి వ్యక్తి మృతి

ఎస్ రాయవరం(M) కొరుప్రోలు గ్రామంలోని సత్య వినాయక కొబ్బరి పీచు పరిశ్రమ స్టోరేజ్ షెడ్పై మరమ్మతు పనులు చేస్తుండగా గురువారం ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎస్ రాయవరం గ్రామానికి చెందిన వెల్డర్ కొమ్ము నూకరాజు (50) షెడ్పై నుంచి జారి పడి తీవ్ర గాయాలపాలైయ్యాడు. అతనిని అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందాడని, దీనిపై కేసు నమోదు చేశామని ఎస్ఐ విభీషణరావు తెలిపారు.
News March 6, 2026
మొక్క జొన్న రైతుల బకాయిలు విడుదల

TG: మొక్క జొన్న రైతుల పెండింగ్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది. మార్క్ఫెడ్కు ₹171 కోట్లు రిలీజ్ చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఒకటీరెండు రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు చెప్పారు. ‘వానాకాలానికి సంబంధించి 78,500 మంది నుంచి 3.77 లక్షల టన్నుల మొక్కజొన్నలు మార్క్ఫెడ్ కొనుగోలు చేసింది. తొలిదశలో ₹735.39 కోట్లు చెల్లించాం. మిగతా నిధులను తాజాగా రిలీజ్ చేశాం’ అని పేర్కొన్నారు.
News March 6, 2026
రష్యా ఆయిల్ కొనుగోలు.. వెనక్కి తగ్గిన US

రష్యా ఆయిల్ కొనేందుకు 30 రోజుల పాటు భారత్కు US తాత్కాలిక మినహాయింపు ఇచ్చిందని ఆ దేశ ఉన్నతాధికారులు చెప్పినట్లు జాతీయ మీడియా పేర్కొంది. మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వాషింగ్టన్ దీనికి అంగీకరించినట్లు తెలిపింది. అయితే ప్రస్తుతం సముద్ర జలాల్లో ఉన్న రష్యా ఆయిల్ను కొనేందుకే అనుమతి ఇచ్చినట్లు చెప్పింది. కాగా భారత్ వద్ద కేవలం 25 రోజులకు సరిపడా ముడిచమురు నిల్వలే ఉన్నట్లు తెలుస్తోంది.


