News March 24, 2024
రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యం: మంత్రి సీతక్క
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_32024/1711204786461-normal-WIFI.webp)
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అధ్యక్షతన విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ రాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కార్యకర్తలంతా సైనికుల్లా పని చేయాలన్నారు. దేశం కోసం గాంధీ కుటుంబం అనేక త్యాగాలు చేసిందన్నారు.
Similar News
News July 8, 2024
ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్గా ప్రకాష్ రెడ్డి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720421632545-normal-WIFI.webp)
తెలంగాణ రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్గా భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఐత ప్రకాష్ రెడ్డి నియమితులయ్యారు. తన నియామకానికి సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఇతర ముఖ్య నేతలకు ప్రకాష్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ కార్పొరేషన్ బలోపేతానికి కృషి చేస్తానని ప్రకాశ్ రెడ్డి చెప్పారు.
News July 8, 2024
ఆయిల్ సీడ్స్ ఫెడరేషన్ ఛైర్మన్గా రాఘవరెడ్డి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720421172269-normal-WIFI.webp)
తెలంగాణ రాష్ట్ర కో-ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ ఫెడరేషన్గా జంగా రాఘవరెడ్డి నియమితులయ్యారు. తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని, రాష్ట్ర కో-ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ ఫెడరేషన్ బలోపేతానికి కృషి చేస్తానని రాఘవరెడ్డి చెప్పారు. నూతన కార్పొరేషన్ ఛైర్మన్ను పలువురు నేతలు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
News July 8, 2024
రాజన్న నీవు దూరమైన నీ సాహసం చెరగని సంతకం: మంత్రి కొండా
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720418430356-normal-WIFI.webp)
రాజన్న నీవు దూరమైనా.. నీ సాహసం చెరగని సంతకం, నీ ప్రస్థానం మరువని జ్ఞాపకం అని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ట్వీట్ చేశారు. పేద ప్రజల సంక్షేమం కోసం రాజశేఖర్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు చరిత్రలో నిలిచిపోతాయని, ప్రతి తెలుగు వాడి గుండెల్లో రాజశేఖర్ రెడ్డి నిలిచిపోయారని మంత్రి కొండా సురేఖ చెప్పుకొచ్చారు.