News March 15, 2025
నంద్యాల: అధిక ధరలకు స్టాంపుల విక్రయాలు

నంద్యాలలో అధిక ధరలకు స్టాంపుల విక్రయాలు జరుగుతున్నాయని వినియోగదారులు వాపోతున్నారు. రూ.100 స్టాంప్ రూ.300 విక్రయాలు చేస్తూ అందినకాడికి దోచుకుంటున్నారని తెలిపారు. ఇందులో కామన్ సర్వీస్ స్టాంప్ సెంటర్లు, స్టాంప్ వెండర్లు కీలక పాత్ర వహిస్తున్నారు. ఒక రింగుగా మారి అందరూ ఒకటే ధరలకు విక్రయాలు చేస్తున్నారని, ఈ విషయం అధికారులకు తెలిసినా చర్యలు మాత్రం శూన్యమని వినియోగదారులు తెలిపారు.
Similar News
News March 25, 2026
తమిళనాడులో ‘హీరోయిజం’ పనిచేయట్లేదా?

తమిళ రాజకీయాల్లో ఒకప్పుడు అక్కడి సినీపరిశ్రమ ఆధిపత్యం ఉండేది. మాజీ సీఎంలు MGR, కరుణానిధి, జయలలిత ఆ కోవకు చెందిన వారే. కానీ ఇప్పుడు సీన్ మారింది. 2019లో లోక్సభ, 2021లో TN అసెంబ్లీ ఎన్నికల ఓటమితో కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యమ్ పార్టీ ఇప్పుడు DMK సపోర్టర్గా మిగిలింది. దీంతో ఈసారి ఎన్నికల బరిలోకి దిగి సోలోగా పోటీకి సిద్ధమవుతున్న విజయ్ TVK పార్టీ భవితవ్యం చర్చనీయాంశమైంది. <<-se>>#Elections2026<<>>
News March 25, 2026
ఖమ్మంలో 28న జాతీయ లోక్ అదాలత్

ఖమ్మం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 28న(శనివారం) జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, సంస్థ చైర్మన్ జి.రాజగోపాల్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఖమ్మంలోని న్యాయ సేవా సదన్ భవనంలో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. రాజీ పడదగ్గ సివిల్, క్రిమినల్ కేసులను ఈ అదాలత్ ద్వారా త్వరితగతిన పరిష్కరించుకోవాలని ఆయన కోరారు.
News March 25, 2026
భూపాలపల్లి జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు: ఎస్పీ

జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని భూపాలపల్లి ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతుల కారణంగా ప్రజలు ఆందోళనకు గురై బంకుల వద్ద రద్దీ సృష్టిస్తున్నారని అన్నారు. అన్ని బంకుల్లో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని, సరఫరా నిరంతరంగా కొనసాగుతోందని స్పష్టం చేశారు. అవసరానికి మించి ఇంధనం నిల్వ చేసుకోవద్దని, అసత్య ప్రచారాలను నమ్మకూడదని విజ్ఞప్తి చేశారు.


