News March 15, 2025
రోడ్డు ప్రమాద బాధితులకు పరిహారం: విశాఖ సీపీ

విశాఖ సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రోడ్డు ప్రమాద బాధితుల సహాయక కేంద్రం ద్వారా బాధితులకు శుక్రవారం రూ.2,50,000ల పరిహారం అందజేసినట్లు సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. ఇటీవల హిట్ రన్ ప్రమాదంలో చనిపోయిన సంతోషి కుటుంబానికి రూ.2లక్షలు ఇచ్చారు. తీవ్ర గాయాలైన శశాంక్కు రూ.50వేలను వారి బ్యాంక్ అకౌంట్లలో డిపాజిట్ చేసినట్లు సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. ఇప్పటి వరకూ 21 మంది బాధితులకు రూ.15 లక్షలు అందించారు.
Similar News
News March 15, 2025
ఒంటిపూట నిబంధన పాటించకుంటే చర్యలు: డీఈవో

విశాఖ జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు శనివారం నుంచి ఒంటిపూట బడులు నడపాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్.ప్రేమ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఉదయం 07:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పాఠశాలలు నిర్వహించాలని సూచించారు. ఎండలు దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జిల్లాలో ప్రతీ పాఠశాల తప్పక నిబంధనలు పాటించాలని లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News March 15, 2025
విశాఖలో కేజీ కీర రూ.26

విశాఖ 13 రైతు బజార్లో శనివారం నాటి కూరగాయ ధరలను అధికారులు ఈ విధంగా నిర్ణయించారు. (KG/రూలలో) టమాటా రూ.15, ఉల్లి రూ.23/28, బంగాళదుంపలు రూ.16, దొండకాయలు రూ.38, మిర్చి రూ.28, బెండ రూ.40, బీరకాయలు రూ.54, క్యారెట్ రూ.22/27, బీట్రూట్ రూ.18, బీన్స్ రూ.52, గ్రీన్ పీస్ రూ.54, వంకాయలు రూ.40/42, కీర రూ.26, గోరు చిక్కుడు రూ.38, పొటల్స్ రూ.86, బరబాటి రూ.38గా నిర్ణయించారు.
News March 14, 2025
అవుట్సోర్సింగ్ ఉద్యోగాల ప్రచారం ఫేక్: ఈఓ

సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ దేవస్థానంలో అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల నియామకం జరుగుతుందనే ప్రచారాన్ని నమ్మవద్దని ఆలయ ఈఓ సుబ్బారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వాట్సాప్ /సోషల్ మీడియా గ్రూపుల్లో ఈ ప్రచారం జరుగుతుందని దేవస్థానం దృష్టికి వచ్చిందన్నారు. ఆలయానికి సంబంధించి ఎలాంటి ఉద్యోగాలు ప్రకటనలు ఇవ్వలేదని స్పష్టం చేశారు. తప్పుడు ప్రకటనలను నమ్మి నిరుద్యోగులు మోసపోవద్దని సూచించారు.