News March 15, 2025

బాసరలో వెయ్యి ఏళ్ల నాటి విగ్రహాలు

image

బాసర సరస్వతి నిలయంగా పేరుగాంచిన పాపహారేశ్వర స్వామి దేవాలయం వద్ద వేయ్యి ఏళ్ల నాటి విగ్రహాలు ఆదరణ లేకుండా నిర్లక్ష్యంగా పడి ఉన్నట్లు పురావస్తు పరిశోధకులు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ డా.శివనాగిరెడ్డి తెలిపారు. తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు, స్థానిక చరిత్రకారులు శుక్రవారం ఆలయ పరిసరాలను పరిశీలించారు. అక్కడ చారిత్రక ఆనవాళ్లు, విగ్రహాలు, శాసనాలు ఉన్నట్లు గుర్తించి వాటిని పరిశీలించారు.

Similar News

News March 15, 2025

WPL: ఫైనల్ విజేత ఎవరో?

image

నేడు WPL ఫైనల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌, ముంబై ఇండియన్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ సారి ఎలాగైనా కప్పు కొట్టాలని ఢిల్లీ, రెండో ట్రోఫీ ఖాతాలో వేసుకోవాలని ముంబై ఉవ్విళ్లూరుతున్నాయి. ఆల్‌రౌండర్లు నాట్ సీవర్, హేలీ మాథ్యూస్‌లతో ముంబై టీమ్ స్ట్రాంగ్‌గా ఉంది. ఈ సీజన్‌లో ముంబైపై ఢిల్లీదే ఆధిపత్యం. కాగా మ్యాచ్ రా.8.00 గంటలకు ప్రారంభం కానుంది. జియో హాట్ స్టార్, స్టార్ స్పోర్ట్స్‌లలో లైవ్ చూడవచ్చు.

News March 15, 2025

మదనపల్లెలో ‘నారికేళి’ సినిమా షూటింగ్

image

వైష్ణవి మూవీ మేకర్స్ సమర్పణలో ‘నారికేళి’ అనే సినిమా షూటింగ్ మదనపల్లెలో ప్రారంభమైంది. శుక్రవారం బర్మా వీధిలోని సాయిబాబా ఆలయంలో పూజా కార్యక్రమాల అనంతరం హీరో కిరణ్ గోవింద్ సాయి, హీరోయిన్ స్వాతి రెడ్డిపై దర్శకుడు సీ.రెడ్డిప్రసాద్ క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించారు. మదనపల్లె పరిసర ప్రాంతాల్లో స్థానిక నూతన నటీనటులతో సందేశాత్మకంగా ఈ సినిమా రూపొందించనున్నట్లు నిర్మాత చంద్రశేఖర్ తెలిపారు.

News March 15, 2025

స్టేషన్ ఘనపూర్: సీఎం సభ స్థలాలను పర్యవేక్షించిన కలెక్టర్

image

ఈనెల 16న ఘనపూర్ (స్టేషన్) నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం శివునిపల్లి శివారులో జరుగుతున్న ఏర్పాట్లను కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌తో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి పర్యవేక్షించారు. ముందుగా హెలీ ప్యాడ్, సభా స్థలికి సంబంధించిన, ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు.

error: Content is protected !!