News March 15, 2025
గ్రూప్-2, గ్రూప్-3 ఫలితాల్లో సత్తాచాటిన బీర్పూర్ యువకుడు

బీర్పూర్ మండల కేంద్రానికి చెందిన చీరనేని రాజశేఖర్ ఇటీవల విడుదలైన గ్రూప్-2 ఫలితాల్లో 287 ర్యాంకు, గ్రూప్-3 ఫలితాల్లో 86 రాంక్ సాధించారు. ప్రస్తుతం ఆర్మూర్ డిగ్రీ కళాశాలలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. గతంలో రైల్వేలో ఉద్యోగం, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో బీట్ ఆఫీసర్ కూడా విధులు నిర్వర్తించారు. దీంతో తల్లిదండ్రులు చంద్రయ్య, రాజవ్వ, గ్రామస్థులు రాజశేఖర్ విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News January 15, 2026
‘సిటీ ఆఫ్ ట్యాంక్స్’గా తిరుపతి

తిరుపతిని ‘సిటీ ఆఫ్ ట్యాంక్స్’గా అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. నగరంలోని అవిలాల, పేరూరు చెరువులతో పాటు అన్ని చెరువుల సుందరీకరణతో పాటు అలిపిరి సమీపంలో 20–25 ఎకరాల్లో ఆధునిక స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. స్టార్ హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లను ప్రోత్సహించి, విశాఖపట్నం, అమరావతి తరహాలో తిరుపతిని మెగా సిటీగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.
News January 15, 2026
NLG: 5 రోజుల్లో 3 లక్షలకు పైగా వెహికిల్స్ పాస్

హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పూర్తిగా తగ్గింది. సంక్రాంతికి ముందు పంతంగి, కోర్లపహాడ్ టోల్ ప్లాజాల వద్ద ఇసుకేస్తే రాలనన్నీ వాహనాలుండగా ప్రస్తుతం అవి బోసిపోయి కనిపిస్తున్నాయి. గడిచిన 5 రోజుల్లో ఈ ప్లాజాల గుండా సుమారు 3.04 లక్షల వాహనాలు ప్రయాణించాయి. ఇందులో ఒక్క విజయవాడ వైపు వెళ్లినవే 2.04 లక్షల వాహనాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
News January 15, 2026
ఎయిర్ఫోర్స్ స్కూల్ హిండెన్లో ఉద్యోగాలు

ఘజియాబాద్లోని <


