News March 15, 2025

బీసీ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు

image

మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ బీసీ గురుకుల పాఠశాలలో 6, 7, 8, 9 తరగతుల ప్రవేశానికి మిగిలిన సీట్ల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు గడువు ఈనెల 31 వరకు ఉండగా, ఫీజు రూ.150 చెల్లించాలి. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 20న నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు బోనఫైడ్, ఆధార్, కుల, ఆదాయ ధృవపత్రాలు, ఫొటో, సంతకం, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడీ సమర్పించాల్సి ఉంటుంది.

Similar News

News November 6, 2025

డిసెంబర్ 3 నుంచి జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన

image

మెదక్ జిల్లాలోని పాఠశాలల విద్యార్థుల కోసం (6 నుండి 12వ తరగతి) జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన, ఇన్‌స్పైర్ అవార్డ్స్ ఎగ్జిబిషన్‌ను నిర్వహించనున్నట్లు డీఈవో రాధాకిషన్ తెలిపారు. ఈ ప్రదర్శనలు డిసెంబర్ 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు స్థానిక వెస్లీ ఉన్నత పాఠశాలలో జరుగుతాయి. ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపల్స్‌లు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీఈవో సూచించారు.

News November 6, 2025

RPT: పొలంలో కరెంటు తీగలు తగిలి వృద్ధుడు మృతి

image

పొలంలో కరెంటు తీగలు తగిలి వృద్ధుడు మృతి చెందిన ఘటన రామన్నపేట PS పరిధిలో జరిగింది. తుమ్మలగూడెంలో గోర్లా మల్లయ్య(75) NOV 5న గేదెలను మేపడానికెళ్లి ఇంటికి రాలేదు. మనవళ్లు, గ్రామస్థులు వెతికినా జాడలేదు. గురువారం ఉదయం గర్దాసు శ్రీను బావి వద్ద అతను, గేదె చనిపోయి కనిపించారు. తీగలకు తగిలి మరణించాడని భార్య ఫిర్యాదు చేసింది. రామన్నపేటలో పోస్ట్ మార్టం చేయించి డెడ్ బాడీని అప్పజెప్పినట్లు SI నాగరాజు తెలిపారు.

News November 6, 2025

కశింకోట: 48 కిలోల గంజాయి పట్టివేత

image

కశింకోట మండలం అచ్చెర్ల జంక్షన్ వద్ద గురువారం 48 కిలోల గంజాయి (20 ప్యాకెట్లు) స్వాధీనం చేసుకున్నట్లు సీఐ స్వామి నాయుడు తెలిపారు. ఈగల్ టీమ్ సమాచారంతో తనిఖీలు చేపట్టగా, వైట్ మారుతి కారులో గంజాయిని గుర్తించామన్నారు. గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామన్నారు. మరొక వ్యక్తి పరారైనట్లు వెల్లడించారు. నిందితుడి వద్ద మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.