News March 15, 2025

ఎర్రుపాలెం: అప్పులు బాధ తాళలేక రైతు ఆత్మహత్య

image

అప్పులు బాధ తాళలేక కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఎర్రుపాలెం మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. మొలుగుమాడుకి చెందిన తోట వెంకటేశ్వరరావు అనే రైతు తనకున్న రెండున్నర ఎకరాల పొలంతో పాటు మరో 5ఎకరాలు కౌలుకు తీసుకుని మిర్చి పంట సాగు చేశాడు. పంట సరిగా పండకపోవడంతో చేసిన అప్పులు తీర్చలేక బాధతో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News May 8, 2025

ఖమ్మం: ఆసుపత్రి నర్స్.. అనుమానాస్పద మృతి

image

సత్తుపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న భూక్య కళ్యాణి(22) అనే యువతి అనుమానాస్పదంగా మృతి చెందింది. పెనుబల్లి మండలం బ్రహ్మలకుంటకు చెందిన కళ్యాణి సత్తుపల్లిలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో నర్సుగా పనిచేస్తూ మసీదు రోడ్డులోని ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటుంది. రూమ్‌లో ఉరివేసుకుని మృతి చెందగా స్థానికులు గమనించి కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

News May 7, 2025

KMM: సెలవుల్లో పిల్లలు జర జాగ్రత్త..!

image

బడులకు వేసవి సెలవులు, పిల్లలకు ఆటవిడుపు మొదలయ్యాయి. పిల్లలకు ఆటలు, తమ మిత్రులతో సరదా కోసం ఈతకు బయటకి వెళ్తుంటారు.. పిల్లలను తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి. గత వారం రోజులుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎండలు మండిపోతుండటంతో పిల్లలు ఆటవిడుపు కోసం బయటకి వెళ్లి వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉందని, పిల్లలను బయటకు వెళ్లకుండా తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు పాటించాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.

News May 7, 2025

ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్యాంశాలు

image

1) ఖమ్మం: ‘విద్యా రంగాన్ని నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వాలు’ 2) ఏన్కూర్: ‘ఎన్నికలొస్తే బీఆర్ఎస్‌దే విజయం’ 3) కూసుమంచి: ఖమ్మం-సూర్యాపేట హైవేపై ఆటో పల్టీ 4) మధిర: వర్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా 30న సభ 5) మధిర: బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ 6) ఖమ్మం: తపాలా శాఖ రూ.10, రూ.15లక్షల బీమా 7) ధరణిని బంగాళాఖాతంలో కలిపాం: వైరా ఎమ్మెల్యే 8) ఖమ్మం: ఆరోగ్య రక్షణలో వైద్యులు కీలకం: కలెక్టర్.