News March 15, 2025
చిత్తూరు ఇన్ఛార్జ్ కలెక్టర్గా విద్యాధరి

చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ నేటి(శనివారం) నుంచి ఈ నెల 19వరకు సెలవులోకి వెళ్లినట్లు అధికారులు తెలిపారు. వ్యక్తిగత పనుల నిమిత్తం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇన్ఛార్జ్ కలెక్టర్గా జాయింట్ కలెక్టర్ విద్యాధరి వ్యవహరించనున్నారు.
Similar News
News January 16, 2026
చిత్తూరు: అసభ్యకర పోస్టులపై విచారణ

సమాచార శాఖ.కుప్పం అధికారిక వాట్సాప్ గ్రూపులో <<18869391>>అసభ్యకర వీడియోలు <<>>కలకలం రేపాయి. ఇదే అంశంపై Way2Newsలో ప్రచురితమైన వార్తకు పోలీసులు స్పందించారు. చిత్తూరు ఎస్పీ తుషార్ డూడి ఆదేశాలతో విచారణ చేస్తున్నారు. కుప్పం నియోజకవర్గ ప్రింట్ &ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో పాటు కుప్పం RDO, I&PR అధికారులు ఉన్న గ్రూపులో గురువారం సాయంత్రం అసభ్యకరమైన పోస్టులు షేర్ చేయగా నిమిషాల వ్యవధిలో ఆ అధికారి డిలీట్ చేశారు.
News January 15, 2026
రొంపిచర్ల: కోళ్లఫారంలో యువకుడి సూసైడ్

రొంపిచర్ల: కోళ్ల ఫారంలో యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై మధుసూదన్ చెప్పారు. పశ్చిమ బెంగాల్కి చెందిన రవీంద్ర చిక్బరైక్ (29) ఓ కోళ్లఫారంలో పనిచేస్తున్నాడు. ఆరోగ్యం సరిగాలేదని అతని భార్య రష్మీ తెలియజేసినట్లు ఎస్సై తెలిపారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
News January 15, 2026
చిత్తూరు ఎస్పీకి నోటీసులు

చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్కు జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. చిత్తూరుకు చెందిన దివ్యాంగురాలైన కవిత మృతి కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని న్యాయవాది అర్షద్ అయుబ్ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో నోటీసులు జారీ అయినట్లు సమాచారం. కేసు దర్యాప్తు చేస్తున్న సంబంధిత అధికారులు ఈనెల 21న కమిషన్ ముందు హాజరై నివేదికను అందజేయాల్సి ఉంది.


