News March 15, 2025
నాగసముద్రంలో 41°C ఉష్ణోగ్రత

అనంతపురం జిల్లాలో రికార్డు ఉష్ణోగ్రత నమోదైంది. శుక్రవారం జిల్లాలోని నాగసముద్రంలో ఏకంగా 41°C ఉష్ణోగ్రత నమోదైనట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఇదే అత్యధిక ఉష్ణోగ్రత. రాబోయే రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
Similar News
News January 12, 2026
కడప: ఒక MRO సస్పెండ్.. మరో 11 మందికి నోటీసులు

రైతులకు పాసు పుస్తకాల పంపిణీలో నిర్లక్ష్యం వహించిన రెవెన్యూ అధికారులపై కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి కొరడా ఝులిపించారు. ముఖ్యంగా జిల్లా అతి తక్కువగా పాసు పుస్తకాలను పంపిణీ చేసిన తొండూరు MRO రామచంద్రుడు సస్పెండ్ చేశారు. అలాగే చెన్నూరు, పెండ్లిమర్రి, VNపల్లె, గోపవరం, పోరుమామిళ్ల, కలసపాడు, చక్రాయపేట, ఖాజీపేట, B.మఠం, ప్రొద్దుటూరు, CK దిన్నె MROలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
News January 12, 2026
ప.గో: అర్జీదారులకు గమనిక.. గ్రీవెన్స్ వేదిక మార్పు

ప్రతి సోమవారం గొల్లలకోడేరు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించే ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ వేదికను తాత్కాలికంగా మార్చినట్లు ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. అర్జీల స్వీకరణ కార్యక్రమం గొల్లలకోడేరు కార్యాలయానికి బదులుగా భీమవరం వన్టౌన్ పోలీస్ స్టేషన్లో జరగనుంది. గొల్లలకోడేరు కార్యాలయానికి రావాల్సిన అర్జీదారులు నేరుగా వన్టౌన్ స్టేషన్కు వచ్చి తమ వినతులు అందజేయాలని ఎస్పీ ఒక ప్రకటనలో కోరారు.
News January 12, 2026
ఈకల రంగును బట్టి కోళ్ల జాతిని గుర్తిస్తారు

ఈకల రంగుని బట్టి కోడిపుంజు రకాలను, జాతులను గుర్తిస్తారు. నల్ల ఈకలుంటే “కాకి”, తెల్లని ఈకలుంటే “సేతు” అని, మెడపై నలుపు, తెలుపు ఈకలు సమానంగా ఉంటే “పర్ల”, ఈకలు మొత్తం ఎర్రగా ఉంటే ‘డేగ’ అని, రెక్కల పై లేదా వీపుపై పసుపు రంగు ఈకలు ఉంటే దానిని “నెమలి” అని పిలుస్తారు. ఇంకా మూడు రంగుల ఈకలు, నలుపు, ఎరుపు, పసుపు రంగుల్లో సమానంగా ఉంటే దానిని “కౌజు” అని, ఈకలు లేత బంగారు రంగులో ఉంటే ‘అబ్రాసు’ అంటారు.


