News March 15, 2025
KMM: ఏడాదిలో 16మంది ఏసీబీకి చిక్కారు..!

ఉమ్మడి ఖమ్మంలో అవినీతి అధికారులు పెరిగిపోతున్నారు. ఏడాదిలో దాదాపు 16 మంది అధికారులు ఏసీబీ అధికారులకు పట్టబడ్డారు. రూ.లక్షల్లో జీతాలు తీసుకుంటున్నా, ఆఖరికి రూ.1500కు కూడా కక్కుర్తి పడి ఏసీబీకి చిక్కుతున్నారు. ఇంకా గుట్టుచప్పుడు కాకుండా ఎంత నడుస్తోందోనని జిల్లావాసులు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు లంచం విషయంలో ఇబ్బంది పెడితే తమను సంప్రదించాలని ఖమ్మం ఏసీబీ డీఎస్పీ రమేశ్ సూచిస్తున్నారు.
Similar News
News January 15, 2026
వచ్చే నెలలో సూర్యగ్రహణం.. భారత్లో నో ఎఫెక్ట్!

వచ్చే నెల 17(మంగళవారం)న సూర్యగ్రహణం సంభవించనుంది. దీనిని ‘రింగ్ ఆఫ్ ఫైర్’గా పేర్కొంటున్నారు. భారత కాలమాన ప్రకారం సా.5.11 గంటలకు ఈ గ్రహణం ఏర్పడనుంది. అయితే ఇది మనదగ్గర కనిపించదు. అంటార్కిటికా, ఆఫ్రికాలోని కొన్ని దేశాలు, ఆస్ట్రేలియా, హిందూ మహాసముద్ర తీర ప్రాంతాల్లో చూడవచ్చు. మన దేశంలో కనిపించే అవకాశం లేకపోవడంతో ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదని పండితులు చెబుతున్నారు.
News January 15, 2026
‘సిటీ ఆఫ్ ట్యాంక్స్’గా తిరుపతి

తిరుపతిని ‘సిటీ ఆఫ్ ట్యాంక్స్’గా అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. నగరంలోని అవిలాల, పేరూరు చెరువులతో పాటు అన్ని చెరువుల సుందరీకరణతో పాటు అలిపిరి సమీపంలో 20–25 ఎకరాల్లో ఆధునిక స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. స్టార్ హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లను ప్రోత్సహించి, విశాఖపట్నం, అమరావతి తరహాలో తిరుపతిని మెగా సిటీగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.
News January 15, 2026
NLG: 5 రోజుల్లో 3 లక్షలకు పైగా వెహికిల్స్ పాస్

హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పూర్తిగా తగ్గింది. సంక్రాంతికి ముందు పంతంగి, కోర్లపహాడ్ టోల్ ప్లాజాల వద్ద ఇసుకేస్తే రాలనన్నీ వాహనాలుండగా ప్రస్తుతం అవి బోసిపోయి కనిపిస్తున్నాయి. గడిచిన 5 రోజుల్లో ఈ ప్లాజాల గుండా సుమారు 3.04 లక్షల వాహనాలు ప్రయాణించాయి. ఇందులో ఒక్క విజయవాడ వైపు వెళ్లినవే 2.04 లక్షల వాహనాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.


