News March 15, 2025

సూర్యాపేటలో రూ.1430 కోట్ల సీఎంఆర్ బకాయిలు

image

సూర్యాపేట జిల్లా రాష్ట్రంలోనే టాప్‌లో నిలిచింది. సీఎంఆర్ బియ్యం బకాయిలు చెల్లించడంలో 2-3 ఏళ్ల నుంచి మిల్లర్లు జాప్యం చేస్తున్నారని తెలుస్తోంది. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి సొంత జిల్లాలోనే ఈ విధంగా జాప్యం ఉండడం గమనార్హం. సివిల్ సప్లై అధికారుల నిర్లక్ష్య ధోరణితోనే గతంలో ఈ అవినీతికి తెరలేపినట్లు సమాచారం. రూ.100 కోట్ల అవినీతికి తెరలేపిన వారిపైచర్యలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు.

Similar News

News March 25, 2026

రష్యా, ఇరాన్‌కు ఇజ్రాయెల్ షాక్

image

ఇరాన్‌కు అన్ని వనరులు కట్ చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఇటీవల ఇరాన్-రష్యా మధ్య ఆయుధాల సరఫరాకు కీలకమైన కాస్పియన్ సముద్రం మార్గాన్ని టార్గెట్ చేసింది. ఇరాన్ నేవీ, మౌలికవసతులు ధ్వంసమయ్యేలా బందర్ అన్జాలీ పోర్టుపై దాడి చేయడం చర్చనీయాంశమైంది. ఇరాన్ – రష్యాల మధ్య మిసైల్స్, డ్రోన్లు, గన్స్ మొదలైనవి సరఫరా కావడానికి ఈ పోర్టు కీలకం. ఈ దాడితో ఇరు దేశాలకు ఇజ్రాయెల్ భారీ నష్టం కలిగించింది.

News March 25, 2026

ఏలూరు: శిశువుల విక్రయాలు, కిడ్నాప్స్.. పోలీసుల తీరుపై అనుమానాలు!(1/2)

image

జిల్లాలో పసిపిల్లల విక్రయాలే కాకుండా రెండు సంవత్సరాల మోక్షిత్ కిడ్నాప్ వ్యవహారంపై పోలీసులు పట్టించుకున్న దాఖలాలు లేవనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పసిపిల్లల విక్రయాలలో కేసులో జనసేన మండల నాయకుడు అనిశెట్టి నాగబాబు తల్లి వీరమ్మను మాత్రమే అరెస్టు చేశారు. ఇందులో నాగబాబు, అదేవిధంగా మరో నాయకుడు ఆంజనేయులు అలియాస్ అంజిబాబు ఉన్నప్పటికీ వారిని అదుపులోకి తీసుకోలేదు.

News March 25, 2026

ఏలూరు: శిశువుల విక్రయాలు, కిడ్నాప్స్.. పోలీసుల తీరుపై అనుమానాలు!(2/2)

image

పోలీసులకు, రాజకీయ నాయకులకు ముడుపులు అందిన మూలంగానే కేసు నీరుగారుస్తున్నారనే ఆరోపణలు జిల్లాలో బలంగా వినిపిస్తున్నాయి. పిల్లల విక్రయాలలో ఏలూరులో జనని హాస్పిటల్ డాక్టర్ దంపతుల ప్రమేయం ఉందని తేలినా వారిని అదుపులోకి తీసుకుని వెంటనే విడిచిపెట్టడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ పరిణామాలన్నింటిని చూస్తుంటే.. ఇంతటి సీరియస్ కేసుని పోలీసులు నీరు గార్చే ప్రయత్నాలు చేస్తున్నారనడంలో సందేహం లేదన్నది పలువురి వాదన.