News March 15, 2025
సూర్యాపేటలో రూ.1430 కోట్ల సీఎంఆర్ బకాయిలు

సూర్యాపేట జిల్లా రాష్ట్రంలోనే టాప్లో నిలిచింది. సీఎంఆర్ బియ్యం బకాయిలు చెల్లించడంలో 2-3 ఏళ్ల నుంచి మిల్లర్లు జాప్యం చేస్తున్నారని తెలుస్తోంది. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి సొంత జిల్లాలోనే ఈ విధంగా జాప్యం ఉండడం గమనార్హం. సివిల్ సప్లై అధికారుల నిర్లక్ష్య ధోరణితోనే గతంలో ఈ అవినీతికి తెరలేపినట్లు సమాచారం. రూ.100 కోట్ల అవినీతికి తెరలేపిన వారిపైచర్యలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు.
Similar News
News November 4, 2025
మేడ్చల్: చేప పిల్లల విడుదలపై కలెక్టర్తో మంత్రి వీడియో కాన్ఫరెన్స్

పారదర్శకంగా నిర్వహిస్తున్న చేపపిల్లల విడుదల కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా హాజరయ్యేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. సోమవారం సచివాలయం నుంచి చేప పిల్లల పంపిణీ కార్యక్రమంపై మంత్రి కలెక్టర్లతో మత్స్య, పశుసంవర్థక శాఖ మంత్రివర్యులు వాకిటి శ్రీహరి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మేడ్చల్ కలెక్టరేట్ కార్యాలయం నుంచి అధికారులు పాల్గొన్నారు.
News November 4, 2025
TODAY HEADLINES

* చేవెళ్లలో RTC బస్సును టిప్పర్ ఢీకొని 19 మంది మృతి.. రూ.7 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
* ఎన్ని అవాంతరాలు ఎదురైనా SLBC పూర్తి చేస్తాం: CM రేవంత్
* లండన్లో CM CBNతో హిందూజా గ్రూప్ ప్రతినిధుల భేటీ.. రూ.20వేల కోట్ల పెట్టుబడులకు ఓకే
* CII సమ్మిట్లో రూ.9.8 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు.. 7.5 లక్షల ఉద్యోగావకాశాలు: మంత్రి లోకేశ్
* WWC: ప్లేయర్లకు డైమండ్ నెక్లెస్ల బహుమతి
News November 4, 2025
GHMC పరిధిలో నమోదైన వర్షపాతం వివరాలు

జీహెచ్ఎంసీ పరిధిలో వర్షపాతం నమోదైంది. అత్యధికంగా 5.3 మిల్లీమీటర్ల వర్షపాతం కాప్రా GHMC కార్యాలయంలో నమోదైంది. షేక్పేట్ గౌతమ్నగర్ ఫంక్షన్ హాల్ వద్ద 4.5 మిల్లీమీటర్లు, బాలానగర్ ఓల్డ్ సుల్తాన్నగర్ కమ్యూనిటీ హాల్లో 4.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు TGDPS తెలిపింది. రేపు సైతం మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అంచనా వేసింది.


