News March 15, 2025

ఆ గ్రామానికి వెళ్లాలంటే వీసా కావాలా?: తోపుదుర్తి

image

రాప్తాడు నియోజకవర్గంలోని పోలీసులు పరిటాల సునీత కోసం పని చేస్తున్నారా? అని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు. తనను సిద్ధరాంపురం వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంపై ఆయన మండిపడ్డారు. ఆ గ్రామం పాకిస్థా‌న్‌లో ఉందా? అందుకు ప్రత్యేక వీసాలు కావాలా? అని ప్రశ్నించారు. రాప్తాడు సీఐ, రామగిరి ఎస్‌ఐ పరిటాల కోసం పనిచేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. పోలీసులు తమ పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు.

Similar News

News April 1, 2026

ఎన్టీఆర్ జిల్లాలో నేటి నుంచి రేషన్‌

image

ఎన్టీఆర్ జిల్లాలో నేటి నుంచి రేషన్‌ షాపుల ద్వారా కార్డుదారులకు సరుకుల పంపిణీ ప్రారంభంకానుంది. ఇందుకు సంబంధించి పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. సరుకుల అందజేతకు అన్ని చర్యలు తీసుకున్నారు. బుధవారం నుంచి రేషన్‌ షాపుల ద్వారా నిత్యావసరాలు ఇవ్వనున్నారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం సమయంలో కార్డుదారులకు బియ్యం, చక్కెర గోధుమపిండిని అందజేస్తారు.

News April 1, 2026

ఉమ్మడి అనంత జిల్లాలో గ్యాస్ కష్టాలు: మంత్రి సవిత క్లారిటీ

image

గ్యాస్‌పై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను ఎవరూ నమ్మవద్దని, ఉమ్మడి అనంతపురం జిల్లాలో గ్యాస్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి సవిత భరోసా ఇచ్చారు. మంగళవారం పెనుకొండలో ఆమె మాట్లాడారు. ఎప్పటిలాగే ఇండెంట్ పెట్టిన వారందరికీ సకాలంలో గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తారన్నారు. యుద్ధం నేపథ్యంలో భవిష్యత్తులోనూ ఇబ్బందులు రాకూడదని ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నామన్నారు.

News April 1, 2026

నేడు చర్లలో విద్యుత్తు సరఫరా నిలిపివేత

image

చర్ల మండల కేంద్రంలోని పలు ప్రాంతాల్లో బుధవారం విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలగనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు వెల్లడించారు. RWS ఫీడర్‌ పరిధిలో అత్యవసర లైన్ల మరమ్మతుల దృష్ట్యా ఉ.9 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు విద్యుత్‌ను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల లక్ష్మీ కాలనీ, నాయకుల కాలనీ, ఏకలవ్య, కస్తూరిబా పాఠశాలలు, దేవానగరం, దోసిల్లపల్లి, తాలిపేరు ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో సరఫరా ఉండదని పేర్కొన్నారు.