News March 15, 2025
ఉదయపురంలో వింత గొర్రె పిల్ల జననం

కోటబొమ్మాళి మండలం ఉదయపురం గ్రామంలో వింత ఘటన చోటుచేసుకుంది. కూస భీమారావుకి చెందిన గొర్రెకి వింత జీవి జన్మించింది. పశువైద్యాధికారి డా. లఖినేని కిరణ్ కుమార్ వివరాలు.. శుక్రవారం ఓ గొర్రెకు శస్త్ర చికిత్స చేసి పిల్లను బయటకు తీశారు. ఇలా వింత పిల్లలు పుట్టడాన్ని ఫీటల్ మాన్స్టర్ అంటారని డాక్టర్ వివరించారు. ఆ గొర్రెపిల్ల చనిపోయినట్లు తెలిపారు. దానిని చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపారు.
Similar News
News October 29, 2025
అక్టోబర్, నవంబర్ నెలల్లో సిక్కోలును వణికించిన తుఫాన్లు ఇవే..!

1968 నవంబర్లో వచ్చిన భారీ తుఫాన్ ఉద్దానంతో పాటు జిల్లాపై ప్రభావం చూపింది. 1995 నవంబరులో 180 కిమీ వేగంతో వీచిన గాలులు తుఫాన్తో పంటలు, చెట్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. 1999 సూపర్ సైక్లోన్ జిల్లాను కుదిపేసింది. 2010 జలసైక్లోన్లో లక్షల హెక్టార్లలో పంట దెబ్బతింది. 2012, 2013నీలం, పైలాన్ తుఫాన్లు తీరప్రాంతాల్లో కల్లోలం సృష్టించాయి. 2014, 2018 హుద్ హుద్, తిత్లీ విధ్వంసం నేటికీ జిల్లా ప్రజలు మర్చిపోలేదు.
News October 29, 2025
శ్రీకాకుళం: ప్రభుత్వ ఆసుపత్రుల్లో 37 మంది ప్రసవాలు

తుఫాన్ నేపథ్యంలో 27, 28 తేదీల్లో 37 మంది గర్భిణిలు ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ అయినట్లు DCH కళ్యాణ్ బాబు మంగళవారం తెలిపారు. టెక్కలి 12, ఇచ్ఛాపురం 5, సోంపేట 2, నరసన్నపేట1, రణస్థలం 1లలో ప్రసవాలు జరిగాయన్నారు. నరసన్నపేట 8, పాతపట్నం 3, రణస్థలం 2, ఆమదాలవలస 1, హరిపురం-1, పొందూరు-1 ప్రసవాలు జరిగాయన్నారు. కోటబొమ్మాళి CHCలో గుండె పోటుతో వచ్చిన మహిళకు సుమారు రూ.40 వేల విలువచేసే ఇంజక్షన్ ఇచ్చినట్లు తెలిపారు.
News October 28, 2025
పలాస: జిల్లా మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు

మొంథా తుపాన్ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా మీదుగా వెళ్లే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు మంగళవారం రైల్వే అధికారులు వెల్లడించారు. జిల్లా మీదుగా వెళ్లే భువనేశ్వర్-బెంగళూరు(ప్రశాంతి ఎక్స్ప్రెస్), భువనేశ్వర్-హైదరాబాద్(విశాఖ ఎక్స్ప్రెస్), కోణార్క్ ఎక్స్ప్రెస్తో పాటు విశాఖ-బరంపురం(ఇంటర్ సీటీ) ఎక్స్ప్రెస్, పలాస-విశాఖ(మెమో) ప్యాసెంజర్ రైళ్లు రద్దు చేశారు. రైల్వే ప్రయాణీకులు గమనించాలని కోరారు.


