News March 15, 2025
ఉదయపురంలో వింత గొర్రె పిల్ల జననం

కోటబొమ్మాళి మండలం ఉదయపురం గ్రామంలో వింత ఘటన చోటుచేసుకుంది. కూస భీమారావుకి చెందిన గొర్రెకి వింత జీవి జన్మించింది. పశువైద్యాధికారి డా. లఖినేని కిరణ్ కుమార్ వివరాలు.. శుక్రవారం ఓ గొర్రెకు శస్త్ర చికిత్స చేసి పిల్లను బయటకు తీశారు. ఇలా వింత పిల్లలు పుట్టడాన్ని ఫీటల్ మాన్స్టర్ అంటారని డాక్టర్ వివరించారు. ఆ గొర్రెపిల్ల చనిపోయినట్లు తెలిపారు. దానిని చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపారు.
Similar News
News July 7, 2025
నందిగాం: పురుగు మందు తాగి మహిళ ఆత్మహత్య

నందిగాం మండలం జయపురం గ్రామానికి చెందిన ఆర్.రత్నాలు(54) పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు గత కొద్ది రోజులుగా మహిళ అనారోగ్యంతో బాధపడుతూ శనివారం రాత్రి ఇంటిలో పురుగు మందు తాగింది. అపస్మారక స్థితిలో చేరుకున్న ఆమెను కుటుంబీకులు టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. నందిగాం పోలీసులు కేసు నమోదు చేశారు.
News July 7, 2025
శ్రీకాకుళం IIITలో 149 సీట్లు ఖాళీ

శ్రీకాకుళం IIIT క్యాంపస్కు సంబంధించి మొదటి విడత సీట్ల భర్తీ ఇటీవల పూర్తయ్యింది. మొత్తం 1,010 సీట్లు ఉండగా 867 సీట్లను భర్తీ చేశారు. ఇంకా 149 సీట్లు ఖాళీగా ఉన్నాయి. వీటిని త్వరలో భర్తీ చేయనున్నారు. మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయించి ఈనెల 11, 12వ తేదీలో రెండో విడత ప్రవేశాల లిస్ట్ విడుదల చేస్తారు. ఈనెల 14న క్లాసులు ప్రారంభమవుతాయి.
News July 7, 2025
శ్రీకాకుళంలో నేడు పీజీఆర్ఎస్

ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో నేడు జరుగుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు వారి సమస్యలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్సైట్ను వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. అర్జీలు సమర్పించిన అనంతరం 1100 నంబర్కు నేరుగా ఫోన్ చేసి, వినతులకు సంబంధించిన స్థితి సమాచారం తెలుసుకోవచ్చని అన్నారు.