News March 15, 2025

KNR: మోసాలకు గురవుతున్న వినియోగదారుడు!

image

మార్కెట్ ఏదైనా మోసాలకు గురవుతున్నది మాత్రం వినియోగదారుడే. తనకు జరిగిన అన్యాయాన్ని వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదులు చేయకపోవడం వల్ల వ్యాపారుల అక్రమాలకు గురవుతున్నారు. కరీంనగర్ పట్టణంలో న్యాయం చేయడానికి వినియోగదారుల ఫోరం కోర్టు ఉన్నా ప్రజల అవగాహన లేమితో వినియోగించుకుంటోంది తక్కువే. నేడు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం. వినియోగదారుల హక్కులను తెలుసుకొని వ్యాపారుల మోసాలకు అడ్డుకట్ట వేయండి.

Similar News

News November 13, 2025

నాయీ బ్రాహ్మణులకు గుడ్ న్యూస్

image

AP: రాష్ట్రంలోని పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఆధ్వర్యంలోని కాంప్లెక్సుల్లో నాయీ బ్రాహ్మణులకు షాపులు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బీసీ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ నుంచి అందిన ప్రతిపాదనల మేరకు బీసీ సంక్షేమ శాఖ మెమో జారీచేసింది. 1996లోని GO-13లో పేర్కొన్న నిబంధనలను అనుసరించాలని కలెక్టర్లు, కార్పొరేషన్లు, మున్సిపల్ అధికారులకు సూచించింది.

News November 13, 2025

ADB: స్విమ్మింగ్‌లో దూసుకుపోతున్న చరణ్ తేజ్

image

ఆదిలాబాద్‌కి చెందిన కొమ్ము చరణ్ తేజ్ స్విమ్మింగ్‌లో దూసుకెళ్తున్నాడు. ఇటీవల జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన అతడు తాజాగా ఎస్.జీ.ఎఫ్ రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ సత్తా చాటాడు. హైద్రాబాద్‌లోని జియాన్ స్పోర్ట్స్ అకాడమీలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో చరణ్ తేజ్ కాంస్య పతకం సాధించాడు. 400 మీటర్ల ఐ.ఎం విభాగంలో కాంస్యం సాధించి మరోసారి జిల్లా పేరును రాష్ట్ర స్థాయిలో నిలిపాడు.

News November 13, 2025

పాలకీడు: టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి

image

పాలకీడు మండల కేంద్రంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీ అడ్డ రోడ్ వద్ద కంకర టిప్పర్ ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందాడు. మృతుడు మహంకాళి గూడెం గ్రామానికి చెందిన వ్యక్తిగా స్థానికులు గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేసుకుని ప్రమాద తీరును పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.