News March 15, 2025
గంపలగూడెం: కనుమరుగవుతున్న మామిడి తోటలు

ఉమ్మడి కృష్ణాజిల్లా నూజివీడు డివిజన్లో మామిడి పండ్లు అంటే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎంత ప్రాధాన్యతుందో మనకి తెలిసిన విషయమే. ఆ డివిజన్లో గంపలగూడెం కూడా ఒక భాగమే. అయితే గంపలగూడెం మండల పరిధిలోని ఇప్పటి వరకు సుమారు 200 ఎకరాల మామిడి తోటలు నరికివేతకు గురయ్యాయి. దీనికి కారణం కోతులు బెడద, పంట చేతికొచ్చే సమయానికి వాతావరణంలో మార్పులు, ఇలా పలు కారణాలు వల్ల మామిడి తోటలు కనుమరుగవుతున్నాయని రైతులు వాపోయారు.
Similar News
News September 18, 2025
ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ బదిలీ

ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ పదోన్నతిపై బదిలీ అయ్యారు. ఆయన్ను ములుగు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (ఎస్డీపీవోగా) నియమిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆయన ములుగు హెడ్ క్వార్టర్కు బదిలీ అయ్యారు. కాగా ప్రస్తుతం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ ఏటూరునాగారం సబ్ డివిజనల్లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈమేరకు బదిలీపై ఆయన ములుగు వెళ్లనున్నారు.
News September 18, 2025
రేపు మంచిర్యాలలో జిల్లా స్థాయి బోధనాభ్యసన సామగ్రి మేళా

మంచిర్యాలలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం జిల్లా స్థాయి బోధనాభ్యసన సామగ్రి మేళా నిర్వహించనున్నట్లు డీఈఓ యాదయ్య ఈరోజు తెలిపారు. జిల్లాలోని 18 మండలాల నుంచి మండల స్థాయి టీఎల్ఎం మేళాలో ఎంపికైన 172 మంది ఉపాధ్యాయులు తమ ఎగ్జిబిట్స్తో హాజరు కానున్నారని పేర్కొన్నారు. బోధన అభ్యసన ప్రక్రియలో విద్యార్థులకు సులభంగా అర్థం కావడానికి ఈ మేళా ఎంతో దోహదపడుతుందన్నారు.
News September 18, 2025
చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు: ఎస్పీ

చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. గురువారం జిల్లాలో వాహనాల తనిఖీ చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తులను మొబైల్ సెక్యూరిటీ డివైజులతో వేలిముద్ర సేకరించారు. నేరాల కట్టడిపై నిఘా, రోడ్ సేఫ్టీ నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. ఏదైనా సమస్య వస్తే స్థానిక పోలీస్ స్టేషన్లో గాని, డయల్ 100కు గాని ఫిర్యాదు చేయాలన్నారు.