News March 15, 2025
ఖమ్మం: గుర్తు తెలియని వాహనం ఢీ.. వ్యక్తి మృతి

నిత్యం వార్తా పత్రికలు చేరవేస్తున్న వ్యక్తి.. గుర్తు తెలియని వాహనం ఢీకొని మరణించడంతో వార్తలో నిలిచిన ఘటన చింతకాని మండలంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా రఘునాథపాలెంకు చెందిన రాజుల అనిల్ అనే వ్యక్తి డైలీ న్యూస్ పేపర్స్ను ఆటోలో చేరవేస్తుంటాడు. ఈ క్రమంలో వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.
Similar News
News December 2, 2025
నల్గొండ: స్టోన్ క్రషర్స్ యజమానుల సమ్మె బాట షురూ!

నల్గొండ జిల్లాలో స్టోన్ క్రషర్స్ యజమానులు సమ్మెబాట పట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలతో స్టోన్ క్రషర్ మిల్లులు నడపటం కష్ట సాధ్యంగా మారిందని వాటి యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల్లో సడలింపులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం నుంచి జిల్లాలోని స్టోన్ క్రషర్స్ మిల్లులను బంద్ పెట్టిన వాటి యజమానులు సమ్మెబాట పట్టారు.
News December 2, 2025
ధన్వాడ: ఎన్నికల చిత్రాలు.. ఉదయం బీఆర్ఎస్, రాత్రికి కాంగ్రెస్!

ధన్వాడ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా విచిత్ర రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. ఉదయం కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిన నీరిటి రామచంద్రయ్య సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేశారు. అయితే, రాత్రికి మళ్లీ డీసీసీ మాజీ అధ్యక్షుడు శివకుమార్ రెడ్డి సమక్షంలో ఆయన తిరిగి కాంగ్రెస్లో చేరారు. ఈ అనూహ్య పరిణామంపై స్థానిక ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
News December 2, 2025
GHMC: దీర్ఘకాలిక సేవల కోసం HMWSSB ప్రణాళికలు

GHMCలో శివారు మున్సిపాలిటీల విలీనంతో HMWSSB పరిధి కూడా పెరగనుంది. దీంతో హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ తన సేవలు విస్తరించేందుకు సిద్ధమవుతోంది. జీహెచ్ఎంసీలో శివారు మున్సిపాలిటీల విలీనంతో తాగునీరు, సీవరేజ్, డ్రైనేజి లైన్ నిర్వహణ భారంగా మారనుంది. కొత్తగా లైన్ ఏర్పాటు చేయడంతో పాటు, పాతవాటికి కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. 2047 వరకు ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తోంది.


