News March 15, 2025
KNR: మోసాలకు గురవుతున్న వినియోగదారుడు!

మార్కెట్ ఏదైనా మోసాలకు గురవుతున్నది మాత్రం వినియోగదారుడే. తనకు జరిగిన అన్యాయాన్ని వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదులు చేయకపోవడం వల్ల వ్యాపారుల అక్రమాలకు గురవుతున్నారు. కరీంనగర్ పట్టణంలో న్యాయం చేయడానికి వినియోగదారుల ఫోరం కోర్టు ఉన్నా ప్రజల అవగాహన లేమితో వినియోగించుకుంటోంది తక్కువే. నేడు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం. వినియోగదారుల హక్కులను తెలుసుకొని వ్యాపారుల మోసాలకు అడ్డుకట్ట వేయండి.
Similar News
News March 19, 2026
యుద్ధం ఎఫెక్ట్.. క్రికెట్ బంతుల కొరతపై ఆందోళన!

ప.ఆసియా ఉద్రిక్తతలతో UKలో డ్యూక్ క్రికెట్ బంతుల కొరత ఏర్పడింది. APR 3 నుంచి కౌంటీ సీజన్ ప్రారంభం కానుండగా బంతుల కొరతపై ఆందోళన మొదలైంది. బాల్స్ తయారయ్యే ద.ఆసియా నుంచి రవాణా జరగాల్సి ఉండగా మిడిల్ ఈస్ట్ రూట్లలో అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రత్యామ్నాయ రూట్లను చూస్తున్నట్లు బ్రిటిష్ క్రికెట్ బాల్స్ కంపెనీ ఓనర్ దిలీప్ జజోడియా తెలిపారు. విమానాల్లో తీసుకెళ్లాలంటే ఖర్చు 3 రెట్లు అధికం అవుతుందన్నారు.
News March 19, 2026
పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టిన లోకేశ్: హోంమంత్రి అనిత

వివిధ ప్రభుత్వ శాఖలలో 10,060 పోస్టుల భర్తీకి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేశ్ శ్రీకారం చుట్టినట్లు హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. ఏటా ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రిని ‘X’ వేదికగా అభినందించారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్నారు. నిరుద్యోగ యువత ఆత్మవిశ్వాసంతో సిద్ధం కావాలన్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
News March 19, 2026
అనకాపల్లి: పండగకు వచ్చి మేనకోడలిపై అత్యాచారం..!

అనకాపల్లి మండలంలోని ఓ గ్రామంలో బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ శ్రావణి తెలిపారు. గురువారం తన కార్యాలయంలో కేసుకు సంబంధించిన వివరాలను తెలిపారు. పండగకు వచ్చిన వ్యక్తి వరసకు మేనకోడలైన బాలికను డాబాపైకి తీసుకువెళ్లి అత్యాచారం చేయడంతో పాటు బెదిరించాడు. బాలిక విషయాన్ని తల్లికి చెప్పడంతో ఆమె ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేశామన్నారు.


