News March 15, 2025
KMR: నేటి నుంచి ఒంటి పూట బడులు

జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి ఒంటి పూట బడులు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8 గంటల నుంచి 12:30 వరకు మాత్రమే స్కూలు ఉంటుంది. ఈ నెలలో పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్న జిల్లా పరిషత్ హై స్కూల్లో పరీక్షలైన అనంతరం ఒంటి గంట నుంచి 5 గంటల వరకు స్కూలు ఉంటుంది. వేసవి సందర్భంగా మధ్యాహ్నం వరకే క్లాసులు నిర్వహించనున్నారు.
Similar News
News November 8, 2025
KGHలో పవర్ కట్.. ప్రభుత్వం సీరియస్

KGHలో గురువారం 10 గంటలపాటు కరెంట్ నిలిచిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఛైర్మన్గా ఉన్న ఈ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి ఇంత పెద్ద స్థాయిలో విద్యుత్ అంతరాయం జరగడంపై ఆరోగ్యశాఖ సీరియస్ అయింది. కాగా.. కనీసం జనరేటర్లు కూడా సమకూర్చలేరా అంటూ YCP ప్రభుత్వ వైఫల్యాన్ని తీవ్రంగా ఎత్తిచూపింది. ‘ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం ఆటలాడుతోంది’అంటూ YCP నేతలు విమర్శలు గుప్పించారు.
News November 8, 2025
మెదక్ జిల్లాలో 14,15 తేదీల్లో కవిత పర్యటన

తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కవిత ఈనెల 14, 15 తేదీల్లో మెదక్ జిల్లాలో పర్యటించానున్నారు. 14న మెదక్ జిల్లా శివంపేట నుంచి పర్యటన ప్రారంభం అవుతుంది. అక్కడి నుంచి నర్సాపూర్, కౌడిపల్లి, కుల్చారం మీదుగా మెదక్ పట్టణానికి చేరుకుంటారు. 15న మెదక్ పట్టణం నుంచి ఏడుపాయల సందర్శిస్తారు. పలు సందర్శన అనంతరం మెదక్లో మేధావుల సమావేశంలో పాల్గొంటారు. కేవల్ కిషన్ సమాధి సందర్శించనున్నారు.
News November 8, 2025
ఒలింపిక్స్కు క్రికెట్ జట్ల ఎంపిక ఇలా..

LA-2028 ఒలింపిక్స్లో ఆడే క్రికెట్ జట్ల ఎంపికను ICC పూర్తిచేసినట్లు తెలుస్తోంది. ఖండాలవారీగా ర్యాంకింగ్లోని టాప్ జట్లు ఆడనున్నాయి. IND(ఆసియా), SA(ఆఫ్రికా), ENG(యూరప్), AUS(ఓషియానియా), ఆతిథ్య జట్టుగా USA/WI ఎంపికవుతాయి. ఆరవ జట్టుగా గ్లోబల్ క్వాలిఫయర్ ఎంపిక బాధ్యత అమెరికాపై ఉండనుంది. ఈ విధానం వల్ల ర్యాంకింగ్స్లో రెండో స్థానంలో ఉన్న జట్టుకూ అవకాశం దక్కకపోవచ్చు. దీనిపై త్వరలో క్లారిటీ రానుంది.


