News March 15, 2025
సౌతాఫ్రికా రాయబారికి ట్రంప్ సర్కారు షాక్

తమ దేశంలోని దక్షిణాఫ్రికా రాయబారి ఇబ్రహీం రసూల్కు ట్రంప్ సర్కారు షాకిచ్చింది. ఆయన తమ దేశంలో ఉండటానికి వీల్లేదని, వెంటనే స్వదేశానికి పయనమవ్వాలని తేల్చిచెప్పింది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ మేరకు సోషల్ మీడియాలో వెల్లడించారు. ‘ఇబ్రహీం ఓ జాత్యహంకార రాజకీయ నేత. అమెరికన్లను, మా అధ్యక్షుడిని ద్వేషిస్తున్నారు. ఆయనతో మాట్లాడేదేం లేదు. దేశం నుంచి పంపించేయడమే’ అని పేర్కొన్నారు.
Similar News
News April 3, 2026
13న బీఆర్ఎస్లోకి జీవన్ రెడ్డి?

TG: కాంగ్రెస్కు రాజీనామా చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరడం ఖాయమైందని సమాచారం. ఈ నెల 7న కేటీఆర్ స్వయంగా ఆయన నివాసానికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానిస్తారని తెలుస్తోంది. 13వ తేదీన జీవన్ రెడ్డి గులాబీ గూటికి చేరతారని వార్తలు వస్తున్నాయి. ఆ తర్వాత జగిత్యాలలోనే పార్టీ ప్లీనరీ నిర్వహించేందుకు BRS సన్నాహాలు చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
News April 3, 2026
₹10,000CRతో ‘మావిగన్’ మహానగరం: భరత్

AP: అమరావతికి వెచ్చించే ₹2L కోట్లలో కేవలం ₹10,000CR ‘మావిగన్’కు ఖర్చు చేస్తే మచిలీపట్నం-విజయవాడ-గుంటూరుతో మహానగరం అభివృద్ధి చెందుతుందని YCP మాజీ MP భరత్ పేర్కొన్నారు. ‘మావిగన్ HYD, బెంగళూరుతో పోటీపడుతుంది. నగరాల అభివృద్ధికి వందల ఏళ్లు పడుతుంది. విశాఖ, విజయవాడ నగరాలను కాదని అమరావతిని శూన్యం నుంచి మొదలు పెడతారా? రాజధాని పేరుతో దోచుకుంటున్న CBN, ఇతర నేతలకే అమరావతి గ్రోత్ ఇంజిన్’ అని విమర్శించారు.
News April 3, 2026
యుద్ధం.. భారత్కు రష్యా భరోసా

పశ్చిమాసియాలో యుద్ధం, ఇంధన సంక్షోభం వేళ భారత్కు రష్యా భరోసా ఇచ్చింది. ముడి చమురు, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (LNG) సరఫరా పెంచేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. తమ దేశ కంపెనీల వద్ద ఆ సామర్థ్యం ఉందని, సప్లై పెంచుతామని రష్యా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ మంతురోవ్ తెలిపారు. భారత పర్యటనలో ఉన్న ఆయన ప్రధాని మోదీ, ఆర్థికమంత్రి నిర్మల, NSA అజిత్ దోవల్తో భేటీ అయ్యారు.


