News March 15, 2025

ప్రకాశం జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ఎంతమంది రాస్తున్నారో తెలుసా?

image

ప్రకాశం జిల్లాలో ఈనెల 17వ తేదీ నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. జిల్లాలో మొత్తం 183 ఎగ్జామ్ సెంటర్లలో 29,602 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాస్తున్నట్లుగా డీఈవో కిరణ్ కుమార్ తెలిపారు. బాలురు 14,994 మంది, బాలికలు 14,608 మంది పరీక్షలకు హాజరుకానున్నట్లుగా వెల్లడించారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించారు.

Similar News

News March 15, 2025

ప్రకాశం జిల్లా టీచర్‌కు నేషనల్ అవార్డు

image

ప్రకాశం జిల్లాకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. సింగరాయకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల తెలుగు టీచర్ గాయత్రి విభిన్న ప్రతిభావంతుల జాతీయ సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికయ్యారు. ఢిల్లీలో ఈనెల 7వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరిగిన కార్యక్రమంలో ఆమె తన సాహిత్యాన్ని ప్రదర్శించారు. దీంతో అవార్డు అందుకున్నారు. ఆమెను స్కూల్ ఉపాధ్యాయులు అభినందించారు.

News March 15, 2025

ప్రకాశం: హాల్ టికెట్‌తో ఫ్రీ జర్నీ

image

ప్రకాశం జిల్లాలో ఈనెల 17వ తేదీ నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. ఈనేపథ్యంలో అల్ట్రా, పల్లె వెలుగు బస్సుల్లో హాల్ టికెట్ చూపిస్తే ఉచిత ప్రయాణం కల్పిస్తామని ఏపీఎస్ఆర్టీసీ జిల్లా అధికారి వెంకట్రావు ఓ ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి పరీక్షలు పూర్తయ్యే వరకు ఈ సౌలభ్యం ఆర్టీసీ కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. 10వ తరగతి విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News March 14, 2025

కనిగిరిలో యువకుడి ఆత్మహత్య

image

ప్రకాశం జిల్లాలో పల్నాడు జిల్లా యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తాళ్లూరు మండలానికి చెందిన ఓ మహిళ భర్త చనిపోయాడు. దీంతో ఆమె కనిగిరిలోని పుట్టింటికి వచ్చింది. ఆమెకు సత్తెనపల్లికి చెందిన రవితేజ(28) పరిచయమమ్యాడు. ‘నిన్నే పెళ్లి చేసుకుంటా. మీ అమ్మానాన్నతో మాట్లాడతా’ అంటూ రవితేజ కనిగిరికి వచ్చాడు. ఆమె వద్దని చెప్పడంతో వెళ్లి ఫుల్‌గా మద్యం తాగాడు. మరోసారి ఆమె ఇంటికి వచ్చి చేయి కోసుకోవడంతో చనిపోయాడు.

error: Content is protected !!