News March 15, 2025
మందమర్రి: GREAT.. గ్రూప్- 2,3,4 సాధించిన తిరుపతి

మందమర్రి ప్రాణహిత కాలానికి చెందిన <<15738168>>బొడ్డు తిరుపతి గ్రూపు- 4, 2, 3లలో సత్తాచాటి<<>> పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. 2016లో సింగరేణి నిర్వహించిన JMET ప్రవేశ పరీక్ష రాసి ఉద్యోగం సాధించాడు. తర్వాత గ్రూపు-4 పరీక్ష రాసి ఎన్నికై క్యాతనపల్లి మునిసిపాలిటీలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం చేస్తున్నాడు. గ్రూప్-2లో రాష్ట్రస్థాయి 77 ర్యాంక్, తాజాగా విడుదలైన గ్రూప్-3ఫలితాల్లో రాష్ట్రస్థాయి 60వ ర్యాంకు సాధించాడు.
Similar News
News January 13, 2026
భద్రాద్రి: మురిసిన ముత్తాత వంశం.. 5 తరాల ఆత్మీయ సమ్మేళనం

దుమ్మగూడెం(M) నడికుడి గుడి సమీపంలో కొమరం వీరయ్య – బుచ్చమ్మ (లేట్) దంపతుల వంశీయుల ఆత్మీయ సమ్మేళనం సోమవారం ఘనంగా జరిగింది. వారి ఐదుగురు కుమార్తెల కుటుంబాలకు చెందిన కొడుకులు, కోడళ్లు, మనవళ్లు, మునిమనవళ్లతో కలిపి మొత్తం 5 తరాల సభ్యులు 178 మంది ఓకే వేదికపై కలుసుకున్నారు. చిన్నచిన్న విషయాలకే విడిపోతున్న కుటుంబ వ్యవస్థలో రక్తసంబంధీకులందరూ ఇలా కలిసి ఉండటం నేటి తరానికి ఆదర్శమని స్థానికులు చెబుతున్నారు.
News January 13, 2026
పోలీసు పరేడ్ గ్రౌండులో మిన్నంటిన సంక్రాంతి సంబరాలు

విజయనగరం జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండులో సంక్రాంతి సంబరాలను ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ సతీమణి ఎ.ఆర్.రూపా నాయుడు ముఖ్య అతిధిగా హాజరై సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. సంక్రాంతి సంబరాల్లో పోలీసు అధికారులు, సిబ్బందితోపాటు పోలీసు కుటుంబాలను కూడా భాగస్వాములను చేసి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ప్రజలందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
News January 13, 2026
షాక్స్గామ్ వ్యాలీ.. భారత్కు ఎందుకంత కీలకం?

<<18842137>>షాక్స్గామ్ వ్యాలీ<<>> భారత్కు భౌగోళికంగా, రక్షణ పరంగా చాలా కీలకం. ఇది ప్రస్తుతం చైనా అధీనంలో ఉంది. భారత్ మాత్రం దీన్ని తన భూభాగంగానే పరిగణిస్తోంది. ఇది ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధక్షేత్రం సియాచిన్ గ్లేసియర్కు సమీపంలో ఉంటుంది. ఇక్కడ శత్రువులకు పట్టు చిక్కితే లద్దాక్లోని సైనిక కదలికలను ఈజీగా గమనించొచ్చు. ఈ ప్రాంతం ద్వారా చైనా, పాక్ మధ్య రాకపోకలు పెరిగి ఒకేసారి భారత్పై దాడి చేసే ప్రమాదం పొంచి ఉంటుంది.


