News March 15, 2025
ధన్వాడ: చిరుత దాడిలో దూడ మృతి.!

చిరుత దాడిలో లేగదూడ మృతి చెందిన ఘటన NRPT జిల్లా ధన్వాడ మండలంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలానికి చెందిన రైతు చెట్టుకింది కథలప్ప పొలంలో శుక్రవారం రాత్రి లేగదూడపై చిరుత దాడి చేయడంతో మృతి చెందింది. సుమారు రూ.60 వేలు నష్టం వాటిలినట్లు రైతు తెలిపారు. శనివారం ఉదయం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మల్లేశ్ ఘటన ప్రదేశాన్ని పరిశీలించి చిరుత దాడి జరిగినట్లు నిర్ధారించారు.
Similar News
News March 15, 2025
అప్పటికి పవన్ ఇంకా పుట్టలేదేమో?: డీఎంకే

తమిళ సినిమాలను హిందీలో ఎందుకు డబ్బింగ్ చేస్తున్నారంటూ ప్రశ్నించిన AP Dy.CM పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు DMK కౌంటరిచ్చింది. త్రిభాషా విధానాన్ని పవన్ తప్పుగా అర్థం చేసుకున్నారని ఆ పార్టీ నేత సయీద్ హఫీజుల్లా అన్నారు. ‘కేంద్రం మాపై బలవంతంగా హిందీ భాషను రుద్దుతోంది. TN ద్విభాషా విధానాన్ని పాటిస్తోంది, దీనిపై బిల్లు చేసి 1968లోనే మా అసెంబ్లీ పాస్ చేసింది. అప్పటికి పవన్ ఇంకా పుట్టలేదేమో’ అని సెటైర్ వేశారు.
News March 15, 2025
కొడుతూ పోలీసులు టార్చర్ చేస్తున్నారు: నటి

కస్టడీలో తనపై భౌతిక దాడి జరుగుతోందని నటి రన్యారావు ఆరోపించారు. పోలీసులు పలుమార్లు తనను కొట్టారని, ఆహారం ఇవ్వడం లేదని ఆమె జైలు ఉన్నతాధికారికి ఫిర్యాదు చేశారు. తెల్ల కాగితాలపై సైన్ చేయాల్సిందిగా DRI అధికారులు ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. తనకేమీ తెలియదని, తప్పుడు కేసులో ఇరికించారని అన్నారు. బంగారం స్మగ్లింగ్ చేస్తూ ఆమె అరెస్టవ్వడం తెలిసిందే. CBI, ED సైతం ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాయి.
News March 15, 2025
కొత్తపల్లి: పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

కొత్తపల్లి మండలంలోని నిడ్జింత జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శనివారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ శనివారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న అల్పాహారం నాణ్యత గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అల్పాహారం సరైన సమయానికి అందుతుందా లేదా అని ఆరా తీశారు. అల్పాహారం నాణ్యత లేకుంటే తమ దృష్టికి తేవాలని సూచించారు. తద్వారా మధ్యాహ్న భోజనం అందించాలని చెప్పారు.