News March 15, 2025

యాదాద్రి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి (UPDATE)

image

యాదాద్రి జిల్లా ఆత్మకూర్‌ఎం మండల కేంద్రంలోని రాయగిరి-మోత్కూరు ప్రధాన రహదారిపై తిమ్మాపురం క్రాస్ రోడ్డు వద్ద <<15765722>>రోడ్డుప్రమాదం<<>> జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో తిమ్మాపురం గ్రామానికి చెందిన రమేష్ (34) చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News January 15, 2026

వెంటనే USతో ట్రేడ్ డీల్ చేసుకోవాలి: థరూర్

image

ఇరాన్‌తో వ్యాపారం చేసే దేశాలపై ట్రంప్ 25% సుంకాలు విధిస్తాననడంపై కాంగ్రెస్ MP శశిథరూర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే రష్యాతో వ్యాపారం చేస్తున్నందుకు 50% సుంకాలు ఉన్నాయని గుర్తుచేశారు. భారీ సుంకాలు చెల్లించి USకు ఎగుమతులు చేయడం ఏ భారతీయ కంపెనీకీ సాధ్యం కాదని.. మన వస్తువుల ధరలు పెరిగి పోటీలో వెనుకబడతామని థరూర్ హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే USతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని సూచించారు.

News January 15, 2026

మల్లూరు నరసింహుని సన్నిధిలో మంత్రి సీతక్క

image

సంక్రాంతి సందర్భంగా మంత్రి సీతక్క మంగపేట మండలం మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి అర్చకులు, సిబ్బంది పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. గర్భాలయంలో స్వామివారికి ఆమె ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో జరుగుతున్న వరపూజ మహోత్సవం విశేషాలను ఈవో మహేష్‌ను అడిగి తెలుసుకున్నారు. స్వామివారి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

News January 15, 2026

APలో ఖమ్మం ఎమ్మెల్యేల సందడి

image

సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ APలోని నూజివీడు నియోజకవర్గంలో సందడి చేశారు. నూజివీడులో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలు వేడుకల్లో ఎమ్మెల్యేలు సతి సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కోడిపందాలను వీక్షించారు. అటు సంక్రాంతి పండుగను ఆనందోత్సవాల నడుమ జరుపుకోవాలని ఎమ్మెల్యేలు సూచించారు.