News March 15, 2025

ప్రకాశ్ రాజ్‌కు బండ్ల గణేశ్ కౌంటర్?

image

AP: సినీ నిర్మాత బండ్ల గణేశ్ Xలో ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఇది నటుడు ప్రకాశ్ రాజ్‌కు కౌంటర్‌గానే ట్వీట్ చేసినట్లు నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ‘కృతజ్ఞత లేకుండా బతకడం మానవత్వాన్ని కోల్పోవడమే. ద్రోహంతో బతకడం మనుష్యత్వాన్ని నాశనం చేసుకోవడమే. మనం ఎప్పుడూ కృతజ్ఞతతో జీవించాలి’ అని రాసుకొచ్చారు. కాగా నిన్న డిప్యూటీ సీఎం <<15764256>>పవన్ కళ్యాణ్‌<<>>పై ప్రకాశ్ రాజ్ ఓ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.

Similar News

News January 11, 2026

నేషనల్ అథారిటీ కాంపాలో ఉద్యోగాలు

image

నేషనల్ కాంపెన్సేటరీ అపారెస్టేషన్ ఫండ్ మేనేజ్‌మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ(నేషనల్ అథారిటీ <>కాంపా<<>>) 8 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సంబంధిత విభాగంలో పీజీ అర్హతగల వారు జనవరి 28 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 32ఏళ్లు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.50వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://moef.gov.in/

News January 11, 2026

పసుపు పాలిషింగ్ – తీసుకోవాల్సిన జాగ్రత్తలు

image

పసుపును పాలిషింగ్ చేయడం వల్ల దుంపలు, కొమ్ములపై ఉండే దుమ్ము, ధూళితో పాటు వేర్లు, పొలుసులు తొలగి దుంపలు చూడటానికి ఆకర్షణీయంగా కనబడతాయి. పాలిషింగ్ కోసం చేతితో తిప్పే లేదా విద్యుత్‌తో నడిచే పాలిషింగ్ డ్రమ్ములు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. పాలిష్ చేసేటప్పుడు రంగు కోసం పసుపు పొడిని మాత్రమే వాడాలి. ఇతర కృత్రిమ రంగులు/రసాయనాలు కలపకూడదు. కొమ్ములను, దుంపలను సైజును బట్టి గ్రేడింగ్ చేసి మార్కెట్‌కు పంపాలి.

News January 11, 2026

అయ్యప్ప మాల ఎక్కడ వేసుకున్నామో అక్కడే తీయాలా?

image

ఇలాంటి నియమం లేదు. యాత్ర ముగిశాక ఇంటికొచ్చి గురుస్వామి సమక్షంలో దీక్షా విరమణ చేయవచ్చు. శబరిమలలో మాల తీయకూడదంటారు. మాల ధరించి ఉండటమే స్వామి దర్శనానికి ప్రధాన అర్హత. ఇంటికి చేరాక ద్వారం వద్ద కొబ్బరికాయ కొట్టి, పూజ చేసి, మంత్రపూర్వకంగా మాల విరమణ చేయాలి. మాలను పాలలో శుద్ధి చేసి భద్రపరచాలి. స్థలం కంటే భక్తి, క్రమశిక్షణగా ఉండే వ్రత పాలనే ముఖ్యం. పద్ధతిగా దీక్ష ముగిస్తే వ్రత ఫలం పూర్తిగా లభిస్తుంది.