News March 15, 2025

గోదావరిఖని: ఆటో ట్రాలీ బోల్తా.. పలువురికి గాయాలు

image

ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్ఎఫ్ సీఎఫ్ టౌన్ షిప్‌లో గెస్ట్ హౌస్ మూల మలుపు వద్ద శనివారం ట్రాలీ ఆటో అతివేగంగా నడపడంతో అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన బాధితులను 108 వాహనంలో గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 15, 2025

ఆస్ట్రేలియాలో BGT ఆడే అవకాశాలు తక్కువే: కోహ్లీ

image

రిటైర్మెంట్ తర్వాత ప్రపంచాన్ని చుట్టేస్తానని టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తెలిపారు. ప్రస్తుతం రిటైరయ్యే ఆలోచన లేదన్నారు. కానీ మరోసారి ఆస్ట్రేలియాలో బీజీటీ ఆడే అవకాశాలు తక్కువేనని పేర్కొన్నారు. కాగా 2027-28లో ఆస్ట్రేలియాలో బీజీటీ జరగనుంది. ఆలోగా విరాట్ టెస్టులకు రిటైర్మెంట్ పలికే ఛాన్స్ ఉంది. ఇప్పటికే టీ20లకు స్వస్తి పలికిన విషయం తెలిసిందే.

News March 15, 2025

తిరుమలలో ఘోర అపచారం: రోజా

image

ప్రభుత్వంపై రోజా సంచలన ట్వీట్ చేశారు. ‘పుణ్యక్షేత్రమైన తిరుమలలో ఘోర అపచారం. ఓ మందుబాబు కొండపైన వీరంగం సృష్టించాడు. ఎవరికి ఎంత మందు కావాలంటే అంత అమ్ముతాడంట. కూటమి ప్రభుత్వంలో తిరుమల లాంటి పుణ్యక్షేత్రంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో ఈ వీడియోనే అందుకు నిదర్శనం. రాష్ట్రంలో బెల్టు షాపుల ద్వారా మద్యాన్ని ఏరులైపారిస్తున్నారు. ఇప్పుడది తిరుమలకు కూడా చేరింది. దేవుడా.!’ అంటూ రోజా ట్వీట్ చేశారు.

News March 15, 2025

నిరుపేదలకు నాణ్యమైన సేవలు అందించాలి: కలెక్టర్

image

నిరుపేదలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని జిల్లా కలెక్టర్ చేతన్ పేర్కొన్నారు. శనివారం హిందూపురంలోని జిల్లా ఆస్పత్రిలో అభివృద్ధి కమిటీ సమావేశం జిల్లాకలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో ప్రభుత్వ ఆసుపత్రుల కోఆర్డినేటర్ తిపేంద్రనాయక్, ఆసుపత్రి సూపరింటెండెంట్ లింగన్న, హిందూపురం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు ఉన్నారు. ఆసుపత్రి అభివృద్ధి పనులను ఆమోదం జరిగిందని, నాణ్యమైన వైద్యసేవలు అందించాలన్నారు.

error: Content is protected !!