News March 15, 2025

ఖమ్మం: Way2Newsలో కథనం.. అ.కలెక్టర్ పరిశీలన

image

‘సాగు నీళ్లు కరవై.. పొలం బీళ్లై’ శీర్షికన Way2Newsలో ఈరోజు పబ్లిష్ అయిన కథనానికి అదనపు కలెక్టర్ శ్రీజ స్పందించారు. ముదిగొండ మండలంలోని కమలాపురం గ్రామంలో క్షేత్రస్థాయిలో పర్యటించి, మాట్లాడారు. చివరి ఆయకట్టు వరకు నీరందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతుల సమస్యలను మండల అధికారులు ఉన్నతాధికారులకు నివేదించాలని, తద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ఆమె వెంట మండల అధికారులు పాల్గొన్నారు.

Similar News

News February 27, 2026

ఏరుగట్లలో గుప్తనిధుల కలకలం..!

image

పెనుబల్లి మండలం ఏరుగట్లలో గుప్తనిధుల వేట కలకలం రేపింది. గురువారం అర్ధరాత్రి ముత్యాలమ్మ గుడి సమీపంలో క్షుద్రపూజలు నిర్వహిస్తూ, జేసీబీతో తవ్వకాలు జరుపుతుండగా గ్రామస్థులు అడ్డుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో నిందితులు పట్టుబడ్డారు. ముగ్గురు పూజారులను అదుపులోకి తీసుకున్న వీఎం బంజర్ పోలీసులు..ఘటనా స్థలంలో జేసీబీ, మూడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News February 27, 2026

పోలీస్ భవనాల ప్రారంభానికి డీజీపీ.. ఖమ్మంలో హై అలర్ట్

image

రాష్ట్ర డీజీపీ శివధర్‌ రెడ్డి శుక్రవారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. నూతన పోలీస్‌ భవనాల ప్రారంభోత్సవం నిమిత్తం ఆయన వస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే, ఇటీవల వెలుగుమట్ల భూదాన్ భూముల వ్యవహారం ఉద్రిక్తతలకు దారితీసిన నేపథ్యంలో డీజీపీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. జిల్లాలో నెలకొన్న సున్నిత పరిస్థితుల దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

News February 26, 2026

వెలుగుమట్ల భూదాన్ భూములపై కలెక్టర్ వివరణ

image

ఖమ్మం నగరంలోని వెలుగుమట్ల భూదాన్ భూముల అంశంపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గురువారం వివరణ ఇచ్చారు. హైకోర్టు ఆదేశాల మేరకే ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. లంచ్ మోషన్ పిటిషన్‌ను కూడా కోర్టు తిరస్కరించిందన్నారు. సుమారు రూ.250 కోట్ల విలువైన భూమిని రక్షించామని, అర్హులైన పేదలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.