News March 15, 2025
ప్రధాని పెద్దన్న లాంటివారే.. ఎన్ని సార్లైనా ఢిల్లీకి వెళ్తా: రేవంత్

TG: పదేపదే తాను ఢిల్లీకి వెళ్తున్నానంటూ BRS చేస్తున్న విమర్శలకు CM రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ‘అసెంబ్లీ సాక్షిగా చెబుతున్నా.. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికైనా ప్రధాని పెద్దన్న లాంటివారే. కేంద్రం తీసుకొనే నిర్ణయాలు రాష్ట్రాలపై ప్రభావం చూపుతాయి. పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. ఇందులో రాజకీయం ఏముంది? ఎన్ని సార్లైనా ఢిల్లీకి వెళ్తా. ప్రతి కేంద్రమంత్రి వద్దకు వెళ్లి నిధులు తీసుకొస్తున్నా’ అని తెలిపారు.
Similar News
News March 2, 2026
యువవికాసం: 16.5L అప్లికేషన్లకు ఇచ్చింది జీరో

TG: యువతకు ఆర్థిక సాయం కోసం GOVT రాజీవ్ యువవికాసం పథకాన్ని ప్రకటించడం తెలిసిందే. దీనికి 2025-26 బడ్జెట్లో ₹6వేల CRను కేటాయించింది. ₹4 లక్షలు సబ్సిడీగా అందే ఈ పథకం కోసం 16.50 లక్షల దరఖాస్తులు వచ్చాయి. గత JUN 2న లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ జరగాలి. కానీ చివరి నిమిషంలో ఆర్థిక శాఖ నిధులు లేవనడంతో జరగలేదు. వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయిస్తారా? ఇచ్చినా అమలు చేస్తారో లేదోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
News March 2, 2026
ప్రాణ స్నేహితులు బద్ధ శత్రువులుగా!

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య 1948-1979 వరకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఇజ్రాయెల్ను దేశంగా గుర్తించిన రెండో ముస్లిం దేశం ఇరానే కావడం విశేషం. ఇరాన్కు సైనిక, వ్యవసాయ, టెక్నాలజీ పరంగా హెల్ప్ చేసింది. 1979లో ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్ పాలకులు అమెరికా-ఇజ్రాయెల్ ఒక్కటేనని, అది ‘లిటిల్ సైతాన్’ అని విమర్శించారు. మిడిల్ ఈస్ట్లో ఇరాన్ న్యూక్లియర్ దేశంగా మారడం ఇజ్రాయెల్కు ఇష్టం లేదు. అందుకే ఈ గొడవలు.
News March 2, 2026
పెరుగు తింటున్నారా?

పెరుగు తింటే దగ్గు, జలుబు వంటి సమస్యలు వస్తాయని చాలా మంది అపోహ పడతారు. అయితే అది నిజం కాదని వైద్యులు చెబుతున్నారు. అందులోని ప్రోబయాటిక్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయని తెలిపారు. పాల కంటే పెరుగు సులభంగా జీర్ణం అవుతుందని చెప్పారు. బయట లభించే పెరుగు కంటే ఇంట్లోనే తాజాగా చేసుకోవడం ఉత్తమం అని, ఫ్రిజ్లో ఉంచింది కాకుండా గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న పెరుగు మంచిదని సూచిస్తున్నారు.
Share It


