News March 15, 2025

నరసరావుపేట: స్వచ్ఛ భారత్ మిషన్ ప్రతిజ్ఞ

image

స్వచ్ఛ భారత్ మిషన్ ప్రతిజ్ఞను జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు ఆధ్వర్యంలో శనివారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మూడవ శనివారం నిర్వహించే స్వచ్ఛ ఆంధ్ర- స్వర్ణాంధ్రలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. అందరి సహకారంతోనే స్వచ్ఛ పల్నాడు సాధ్యమవుతుందన్నారు. జాయింట్ కలెక్టర్ సూరజ్ గనూరే, డి.ఆర్.వో. మురళి, కలెక్టరేట్ అధికారులు పాల్గొన్నారు.

Similar News

News January 8, 2026

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు స్పల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఇవాళ రూ.270 తగ్గి రూ.1,38,000కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.250 పతనమై రూ.1,26,500 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.5వేలు తగ్గి రూ.2,72,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ఈ ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.

News January 8, 2026

ప్రచారం కొరవడిన ఫ్లెమింగో ఫెస్టివల్..!

image

తిరుపతి జిల్లా పులికాట్ సరస్సు తీరాన ఈ నెల 10, 11 తేదీలలో ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహణకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. అయితే దీనిపై అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో సందర్శకుల కోసం బస్సులు, ప్రత్యేక టూర్ ప్యాకేజీలు ఏర్పాటు అవుతున్నా దానిపై దృష్టి సారించాలంటే ప్రచారం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

News January 8, 2026

న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ <>(NSIL)<<>>16 కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు JAN 31 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి CA/ICWA, డిగ్రీ, MBA, BE/BTech, MSW, MA, MTech ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. హార్డ్ కాపీని ఫిబ్రవరి 10లో పంపాలి. వెబ్సైట్: https://www.nsilindia.co.in